‘‘పథకాలకు జగన్‌ పేరు పెట్టుకోవడం అలవాటైంది’’

రాష్ట్రంలో కరోనాపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. ఇటీవల వైకాపాతో కాస్త విభేదిస్తూ వస్తున్న రఘురామకృష్ణరాజు ప్రస్తుతం దిల్లీలో ఉంటున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కరోనా పరిస్థితులపై స్పందించారు. ‘

Published : 28 Jul 2020 01:35 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీ: రాష్ట్రంలో కరోనాపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. ఇటీవల వైకాపాతో విభేదిస్తూ వస్తున్న రఘురామకృష్ణరాజు ప్రస్తుతం దిల్లీలో ఉంటున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కరోనా పరిస్థితులపై స్పందించారు.

‘‘ప్రభుత్వం దృష్టికి ఎవరైనా సమస్యలు తీసుకొస్తే పరిష్కరించాలి. కరోనాపై చర్యలు తీసుకోవాలి. పథకాలన్నింటికీ జగన్‌ పేరు పెట్టుకోవడం అలవాటైంది. అలాగే జగనన్న కరోనా కేర్‌ అనో ఏ పేరైనా పెట్టుకోండి. కానీ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలి. కులాలకు అతీతంగా జగనన్న కరోనా కంట్రోల్‌లో సభ్యులు ఉండాలి’’అని ఎంపీ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని