‘‘పీవీకి నివాళిపై ఏపీ సీఎంకు లేఖ రాయండి’’

మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావు చేసిన సంస్కరణల వల్లే దేశం ఈ స్థాయిలో ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. పీవీ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోనూ పీవీకి ఘనంగా నివాళులు అర్పించాల్సిందన్నారు. ఇదే విషయాన్ని సీఎం జగన్‌కు తెలియజేశానని

Updated : 28 Jul 2020 17:14 IST

ప్రజలకు పిలుపునిచ్చిన వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీ: మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావు  సంస్కరణల వల్లే దేశం ఈ స్థాయిలో ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. పీవీ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోనూ పీవీకి ఘనంగా నివాళులు అర్పించాల్సిందన్నారు. ఇదే విషయాన్ని సీఎం జగన్‌కు తెలియజేశానని చెప్పారు. పీవీకి ఘన నివాళి విషయంలో ప్రజలు కూడా సీఎంకు లేఖలు రాయాలని పిలుపునిచ్చారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై రఘురామకృష్ణరాజు తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా పీవీ విషయంలోనూ ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని