Price Hike: ఆ ₹ 23లక్షల కోట్లు ఏమయ్యాయి?: కేంద్రంపై రాహుల్ విమర్శలు
జీడీపీ పెరుగుదల అంటే ఈ ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడమని అనుకుంటోందంటూ ఎద్దేవా చేశారు. వీటి ధరలను పెంచడం ద్వారా గత ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.23లక్షల కోట్లు అర్జించిందన్నారు. ఈ డబ్బంతా ఎక్కడికి పోతోందో దేశ ప్రజలు ప్రశ్నించాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు. .....
జీడీపీ వృద్ధి అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడమా?
దిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్తో పాటు వంట గ్యాస్ ధరలు రోజురోజుకీ ఆకాశాన్నంటుతుండటంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలతో రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, వేతన జీవులు, చిన్న-మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి దిగజారిపోతోందని, మోదీకి చెందిన నలుగురైదుగురు మిత్రులకు మాత్రమే లాభం చేకూరుతోందని దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జీడీపీకి కొత్త భావనను ముందుకు తీసుకొస్తోందన్నారు. జీడీపీ పెరుగుదల అంటే ఈ ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడమని అనుకుంటోందంటూ ఎద్దేవా చేశారు. వీటి ధరలను పెంచడం ద్వారా గత ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.23లక్షల కోట్లు అర్జించిందన్నారు. ఈ డబ్బంతా ఎక్కడికి పోతోందో దేశ ప్రజలు ప్రశ్నించాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు.
అక్కడ ధరలు తగ్గుతుంటే భారత్లో ఎందుకు పెరుగుతున్నాయ్?
2014లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎల్పీజీ వంట గ్యాస్ ధర రూ.410లు ఉంటే.. ఇప్పుడు అది రూ.885కి పెరిగిపోయిందన్నారు. అలాగే, అప్పట్లో రూ.71.5లుగా ఉన్న లీటరు పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.101లకు చేరిందన్నారు. రూ.57లుగా ఉన్న డీజిల్ ధర కూడా ప్రస్తుతం రూ.88కి పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. 2014 నుంచి అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గుతున్నా భారత్లో మాత్రం పెరిగిపోతున్నాయన్నారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం భారతదేశ ఆస్తులు, సంస్థలను అమ్మేస్తోందన్నారు. పెట్రోల్ ధరల పెంపుతో మనందరిపైనా తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రధాని మోదీ డీమానిటైజేషన్ అన్నారనీ.. ఇప్పుడేమో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మానిటైజేషన్ అంటున్నారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో శిలాఫలకాలే మిగిలాయి
వైకాపా పాలన శిలాఫలకాలకే పరిమితమైందని.. అభివృద్ధి ఆచూకీ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
‘ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తెదేపా అధిష్ఠానం ఆదేశించింది. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తా. -
వైకాపాను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రాన్ని దోచేస్తారు
రాష్ట్రంలో మాదిగలు బాగు పడాలంటే వైయస్ జగన్ను ఓడించి... ఎన్డీయే కూటమిని గెలిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. -
రెండోరోజు 367 నామినేషన్లు దాఖలు
రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు 53, శాసనసభ స్థానాలకు 314 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
అనకాపల్లి జిల్లాకు చేరుకున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి అనకాపల్లి జిల్లాకు చేరుకుంది. కాకినాడ జిల్లా తుని మీదుగా పర్యటిస్తూ వచ్చిన ఆయన రాత్రి తొమ్మిది గంటలకు పాయకరావుపేట చేరుకున్నారు. -
కేసీఆర్.. లెక్కపెట్టుకోండి
కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలికి వస్తే సహించేది లేదని.. భారాసలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కేసీఆర్ ప్రతిరోజూ సాయంత్రం లెక్కపెట్టుకోవాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
భారాస, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలే
‘తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్వే లాంటిది. ఎంతోమంది ఉద్యమకారుల బలిదానంతో రాష్ట్రం ఏర్పడింది. భారాస.. ప్రజల సొమ్మును లూటీ చేసింది. -
అయిదేళ్ల పాలనలో సర్వం నాశనం
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. -
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
విజయవాడ అజిత్సింగ్నగర్లోని తెదేపా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసుల కదలికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. -
కుప్పంలో చంద్రబాబు నామినేషన్
కుప్పం నియోజకవర్గ అభ్యర్థిగా తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం 1.27 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. -
కూటమి పాశుపతాస్త్రం
తెదేపా, భాజపా, జనసేన పార్టీల కూటమి నిప్పుల ఉప్పెన, అగ్నిపర్వత విస్ఫోటం అని.. ఆ పాశుపతాస్త్రాన్ని తట్టుకొనే శక్తి ఎవరికీ లేదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. -
ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి నామినేషన్
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
తొలిదశ పోలింగ్ 62.37%
దేశంలో 18వ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటింగ్ శుక్రవారం పూర్తయింది. -
అధికార దాహం తీరకే శాపనార్థాలు
రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన భారాస నేతలు ఇంకా అధికార దాహం తీరక ఈ ప్రభుత్వం కొనసాగదు, కూలిపోతుందని శాపనార్థాలు పెడుతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. -
22 నుంచి కేసీఆర్ బస్సుయాత్ర
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే బస్సు యాత్రకు అనుమతి కోరుతూ భారాస అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవరెడ్డి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) వికాస్రాజ్కు వినతిపత్రం సమర్పించారు. -
రెండో రోజు 57 నామినేషన్లు
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు రెండో రోజైన శుక్రవారం 57 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రెండు రోజుల్లో కలిపి దాఖలైన నామినేషన్ల సంఖ్య 99కి చేరింది. -
దిల్లీ కాంగ్రెస్.. గల్లీ కాంగ్రెస్ వేర్వేరు
దిల్లీ కాంగ్రెస్, గల్లీ కాంగ్రెస్ వేరువేరని.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భాజపాకు ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
ఎన్నికల తర్వాత రుణమాఫీ అంటే నమ్మేదెవరు?
ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల వడ్లకు రూ.14 వేల బోనస్ ఇవ్వాలని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
భాజపా, కాంగ్రెస్లకు ఓట్లు అడిగే హక్కు లేదు
త లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని భాజపా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్లకు ఇప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. -
ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.. ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యేలపై కేసుల నమోదు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు ఓ ఎంపీ అభ్యర్థిపై కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)