Sanjay Raut: రాహుల్ ప్రధానికాగల సమర్థుడు.. సంజయ్ రౌత్ ప్రశంసలు
Sanjay Raut on Rahul gandhi: రాహుల్ గాంధీకి ప్రధానికాగల సమర్థత ఉందని సంజయ్ రౌత్ ప్రశంసించారు. దేశంపై ప్రేమ, సంకల్పం ఉన్నవాళ్లే ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయగలరని భారత్ జోడో యాత్రనుద్దేశించి అన్నారు.
జమ్మూ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) ప్రశంసలు గుప్పించారు. దేశానికి ప్రధాని కాగల సమర్థుడు అని కొనియాడారు. కాంగ్రెస్ లేకుండా మూడో ఫ్రంట్ విఫల ప్రయోగమే అవుతుందని చెప్పారు. జమ్మూకశ్మీర్లో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’లో (Bharat Jodo Yatra) శుక్రవారం రౌత్ పాల్గొన్నారు. రాహుల్తో కలిసి 13 కిలోమీటర్ల పాటు నడక సాగించారు. ఈ నేపథ్యంలో శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.
ప్రజల్లో ఉన్న ద్వేషాన్ని, భయాలను పారదొలేందుకే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేపట్టారని సంజయ్ రౌత్ అన్నారు. అంతే తప్ప కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలను ఏకం చేయడానికి కాదన్నారు. సైద్ధాంతిక, రాజకీయ వైరుధ్యాలను పక్కనపెడితే.. గాంధీలోని నాయకత్వ లక్షణాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు సవాలుగా మారనున్నాయని అన్నారు. ఆ ఎన్నికల్లో రాహుల్ అద్భుతం చేయబోతున్నారని జోస్యం చెప్పారు.
రాహుల్ గురించి భాజపా విపరీతమైన అసత్య ప్రచారం చేసిందని, ఒక్క యాత్రతో అపోహలన్నీ పటాపంచలయ్యాయని రౌత్ అన్నారు. ఈ సందర్భంగా రౌత్ను విలేకరులు ప్రశ్నించారు. దేశ ప్రధాని అయ్యే సమర్థత రాహుల్ గాంధీకి ఉందా అని అడగ్గా.. ‘ఎందుకు కాలేరు?’ అంటూ సమాధానం ఇచ్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల దూరం నడవడం అందరి వల్లా కాదని రౌత్ అన్నారు. దానికి దృఢ సంకల్పం, దేశంపై ప్రేమ అవసరమన్నారు. ఆ రెండూ రాహుల్ గాంధీలో కనిపించాయన్నారు. ఈ యాత్రలో తనకు ఎక్కడా రాజకీయం కనిపించలేదని చెప్పారు. స్వతహాగా రాహుల్కు ప్రధాని కావడం ఇష్టం లేదని, ప్రజలు కోరుకుంటే మాత్రం పదవిని అలంకరిస్తారన్నారు.
కాంగ్రెస్ లేకుండా భాజపాను ఓడించేందుకు మూడో ఫ్రంట్ ఏర్పాటుపైనా ఈ సందర్భంగా రౌత్ స్పందించారు. దేశం నలుమూలలా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పారు. కాంగ్రెస్ లేకుండా మూడో ఫ్రంట్ ఏర్పాటు విజయవంతం కాలేదన్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్కు తక్కువ మంది ఎంపీలే ఉన్నప్పటికీ.. 2024 నాటికి పరిస్థితి మారబోతోందని చెప్పారు. తమ పార్టీ నేత ఆదేశాల మేరకే భారత్ జోడో యాత్రలో పాల్గొన్నట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కశ్మీర్ పరిస్థితుల్లో ఇప్పటికీ పెద్దగా మార్పులేవీ రాలేదని రౌత్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలిదశకు ముగిసిన నామినేషన్లు
లోక్సభ ఎన్నికల తొలిదశకు నామినేషన్ల గడువు బుధవారం ముగిసింది. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
టీఎంసీ దోచుకున్న సొమ్ము పేదలకే
పశ్చిమబెంగాల్లో పేదల నుంచి కొందరు దోచుకున్న రూ.3,000 కోట్లు తిరిగి బడుగులకే దక్కేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. -
అమరావతి భాజపా అభ్యర్థిగా నవనీత్ రాణా
మహారాష్ట్రలోని అమరావతి నుంచి ప్రస్తుతం స్వతంత్ర ఎంపీగా ఉన్న సినీ నటి నవనీత్ రాణాకు భాజపా లోక్సభ టికెట్ ఇచ్చింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో తొలి నుంచి పోరాడుతున్న ఆమెను భాజపా తమ పార్టీలో చేర్చుకుని సీటు కేటాయించింది. -
అరుణాచల్ సీఎం ఖండూ ఎన్నిక ఏకగ్రీవం!
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 సీట్లు ఏకగ్రీవం కానున్నాయి. ఇందులో ముఖ్యమంత్రి పెమా ఖండూ, నలుగురు భాజపా నేతలున్నారు. -
ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదు
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తనవద్ద లేదని, అందుకే భాజపా ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
మహావికాస్ అఘాడీలో లుకలుకలు
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) బుధవారం మహారాష్ట్రలోని 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో రగడ రాజుకుంది. -
దిలీప్ ఘోష్, సుప్రియాలకు ఈసీ నోటీసులు
ఎన్నికలవేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
దిలీప్ ఘోష్, సుప్రియాలకు ఈసీ నోటీసులు
ఎన్నికలవేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
ఓట్లు చీల్చాలనుకునేవారి చేతులు నరికేయాలి
లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని ఝాబువా జిల్లాలో ఎవరైనా ఓట్ల చీలిక గురించి మాట్లాడితే వారిని వదిలిపెట్టకుండా చేతులు నరికేయాలని కాంగ్రెస్ శాసనసభ్యుడు వీర్ సింగ్ భూరియా తన అనుచరులను రెచ్చగొట్టేలా పిలుపునిచ్చారు. -
ఎన్నికల్లో కీలకాంశం నిరుద్యోగమే
నిరుద్యోగ సమస్య నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రధాని మోదీ అన్ని విధాల ప్రయత్నిస్తున్నప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో ఈ అంశమే దేశ భవిష్యత్తును నిర్ణయించనుందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. -
అసమర్థ పాలనతోనే కరవు పరిస్థితులు
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని కరీంనగర్ లోక్సభ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు. -
రైతులకిచ్చిన హామీలేమయ్యాయి?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు ఏనాడో దాటిపోయిందని.. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదని భారాస నేతలు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. -
భాజపా తెలంగాణ ఎన్నికల ఇన్ఛార్జిగా అభయ్పాటిల్
తెలంగాణ లోక్సభ ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం భాజపా ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అభయ్పాటిల్ నియమితులయ్యారు. -
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. -
మాజీ మంత్రి చిత్తరంజన్దాస్ కాంగ్రెస్లో చేరిక
మాజీ మంత్రి చిత్తరంజన్దాస్.. నాగర్కర్నూల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తలకొండపల్లి మండలం సంగాయిపల్లిలో బుధవారం ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి(కల్వకుర్తి), వంశీకృష్ణ (అచ్చంపేట) సమక్షంలో చిత్తరంజన్దాస్కు మల్లు రవి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. -
ఫోన్ ట్యాపింగ్లో ఎర్రబెల్లిదే కీలక పాత్ర
భారాస అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. -
ఫోన్ ట్యాపింగ్పై నిష్పాక్షిక విచారణ చేపట్టాలి
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలని మెదక్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రఘునందన్రావు రాష్ట్ర డీజీపీని కోరారు. -
భారాస ఆరిపోయే దీపం: మధుయాస్కీగౌడ్
భారాస పార్టీ ఆరిపోయే దీపం అని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్ వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. -
సంక్షిప్త వార్తలు
ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇండియా కూటమి ఈ నెల 31న దిల్లీలో నిర్వహించనున్న ‘మహార్యాలీ’ని విజయవంతం చేయడానికి కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేపట్టారు. -
అవినీతి పార్టీలతో పొత్తు అక్కర్లేదు: ఏలేటి మహేశ్వర్రెడ్డి
కాంగ్రెస్, భారాస రెండూ పొత్తు పార్టీలని, గతంలో మంత్రి పదవులు పంచుకున్నాయని నిర్మల్ ఎమ్మెల్యే, భాజపా శానససభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
-
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్