
రాహుల్ గాంధీ యూకే ట్రిప్ వివాదం.. ప్రభుత్వం నుంచి నో క్లియరెన్స్..?
దిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనపై తాజాగా వివాదం చెలరేగుతోంది. లండన్కు బయలుదేరే ముందు భారత్ ప్రభుత్వం నుంచి ఆయన ‘పొలిటికల్ క్లియరెన్స్’ తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. విదేశాల్లో పర్యటన చేసే క్రమంలో ప్రతి పార్లమెంట్ సభ్యుడు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ మాత్రం అది పొందలేదని చెబుతున్నాయి. దీనిపై స్పందించిన కాంగ్రెస్.. ప్రైవేటు కార్యక్రమాలకు ఆ అవసరం లేదని వాదిస్తోంది.
‘ పార్లమెంట్ సభ్యుడు ఎవరైనా ఏదైనా విదేశీ పర్యటన చేసే సమయంలో భారత విదేశీ వ్యవహారాలశాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. విదేశాల నుంచి ఎంపీలకు వచ్చే ఆహ్వానం కూడా భారత విదేశాంగశాఖ ద్వారానే రావాలి. విదేశీ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే వారు అందుకు సంబంధించిన వివరాలతో మూడు వారాల ముందే విదేశాంగశాఖ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. కానీ, రాహుల్ గాంధీ మాత్రం అలా చేయలేదు.’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆహ్వానం నేరుగా అందినట్లయితే.. ఆ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖకు తెలియజేసి పొలిటికల్ క్లియరెన్స్ పొందాలని చెబుతున్నాయి.
విదేశాల్లో ఉన్న రాహుల్ గాంధీ పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోలేదని మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ సభ్యులకు అటువంటి క్లియరెన్స్ అవసరం లేదని పేర్కొంది. ‘అధికారిక బృందం ఐతే తప్ప ప్రధాని నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ ఎంపీలు పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. టీవీ ఛానళ్లకు పీఎంఓ చేసిన వాట్సాప్ మెసేజ్లను గుడ్డిగా నమ్మెద్దు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతోపాటు భాజపాపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో విదేశీ గడ్డపై భారత్ పరువు తీస్తున్నారని రాహుల్ గాంధీపై భాజపా నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే పొలిటికల్ క్లియరెన్స్ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేయలేదా? లేదంటే ఈ సదుపాయం కోల్పోయినట్లే..!
-
General News
Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్స్టేషన్లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
-
Politics News
Pawan Kalyan: జనసేన కౌలురైతు భరోసా నిధికి అంజనాదేవి సాయం.. పవన్కు చెక్కు అందజేత
-
India News
Teesta Setalvad: ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్టు
-
General News
Top Ten news @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Telangana News: టీచర్ల ఆస్తులపై విద్యాశాఖ ఉత్తర్వులు రద్దు చేసిన ప్రభుత్వం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు!
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- Super Tax: పాక్లో ‘సూపర్’ పన్ను!
- Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి