Prashant Kishor: పీకే ఒప్పుకోడని రాహుల్ గాంధీకి ముందే తెలుసా..?
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నిరాకరించారు. తన చేరిక కంటే.. ప్రస్తుతం కాంగ్రెస్కు నాయకత్వం, సమష్టి సంకల్పం ఎక్కువ అవసరమంటూ ఇటీవల ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు.
దిల్లీ: కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నిరాకరించారు. తన చేరిక కంటే.. ప్రస్తుతం కాంగ్రెస్కు నాయకత్వం, సమష్టి సంకల్పం ఎక్కువగా అవసరమంటూ ఇటీవల ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే, హస్తం పార్టీలో చేరేందుకు పీకే ఒప్పుకోడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందే ఊహించారట. ఈ మేరకు పార్టీ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
‘‘పీకే కాంగ్రెస్లో చేరడని రాహుల్ గాంధీ తొలిరోజే చెప్పేశారు. పార్టీలోకి రావాలని ప్రశాంత్ కిశోర్ను ఆహ్వానించడం ఇదేం తొలిసారి కాదు. ఈ విషయమై కాంగ్రెస్, పీకే మధ్య దాదాపు ఎనిమిది సార్లు చర్చలు జరిగాయి. ఇటీవల కూడా పీకేనే స్వయంగా వచ్చి కాంగ్రెస్ నేతలతో సమావేశం అవ్వాలని అడిగారు. పార్టీ పునరుద్ధరణ కోసం ఓ ప్రజెంటేషన్ ఇస్తానని చెప్పారు. ఆయన గురించి తెలిసి రాహుల్ గాంధీ దానిపై ఆసక్తి చూపించకపోవడంతో ప్రియాంక గాంధీ వాద్రా అపాయింట్మెంట్ కావాలని పీకే కోరారు’’ అని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ పెద్దలతో పీకే ఇటీవల పలుమార్లు సమావేశమయ్యారు. అయితే, ఈ భేటీలకు రాహుల్ గాంధీ హాజరుకాకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్నట్లు పార్టీ వెల్లడించింది.
కాంగ్రెస్ పార్టీలో చేరి సాధికారిక కార్యాచరణ బృందంలో సభ్యుడిగా ఉండాలంటూ అధిష్ఠానం పీకేకు ఆహ్వానం అందించింది. అయితే, అందుకు ఆయన తిరస్కరించారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ కోసం తాను రూపొందించిన ప్రణాళికల అమలుకు అవసరమైన స్వేచ్ఛను, కీలక పదవిని ఇచ్చేందుకు నాయకత్వం ససేమిరా అనడంతో ప్రశాంత్ కిశోర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ప్రధానంగా తెరాసతో ఐప్యాక్ ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందం ఈ పరిణామాలకు దారితీసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుని ఇతర పార్టీలకు లాభం చేకూర్చాలని పీకే భావిస్తున్నారంటూ కొందరు హస్తం పార్టీ సీనియర్ నేతలు ఆరోపణలు కూడా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్