Telangana news: తెలంగాణ యువతను మోసం చేసిన వారిని గద్దె దించుతాం: రాహుల్ గాంధీ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సులువుగా ఏర్పాటైంది కాదని.. ఎంతో మంది యువత, తల్లుల రక్తం, కన్నీళ్లతో సాధించుకున్న రాష్ట్రం అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ
హనుమకొండ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సులువుగా ఏర్పాటైంది కాదని.. ఎంతో మంది యువత, తల్లుల రక్తం, కన్నీళ్లతో సాధించుకున్న రాష్ట్రం అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. సభ ప్రధాన వేదికకు ఎదురుగా రెండు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. అంతకుముందు సభా వేదికకు చేరుకున్న రాహుల్.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
‘‘తెలంగాణలో తెరాస పరిపాలన గురించి కొన్ని విషయాలను ప్రజలను అడగాలని అనుకుంటున్నా. ఏ కలలను నెరవేర్చుకోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో.. వాటిని ఈ ప్రభుత్వం నెరవేర్చిందా? కేవలం ఒక కుటుంబానికే మేలు జరుగుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల పరిస్థితికి ఎవరు కారణం?తెలంగాణ సాధనలో ముందడుగు వేసిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. ఈ నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ తెలంగాణ ప్రజల మేలు కోరుతూ సోనియా రాష్ట్రాన్ని ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రజలు, రైతులు, కార్మిక ప్రభుత్వం వస్తుందని అనుకున్నాం. కానీ ఆ కల నెరవేరలేదు. ఇక్కడి ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయడం లేదు. ఒక రాజులా పరిపాలన సాగిస్తున్నారు. రాజు.. సీఎం.. ఈ ఇద్దరిలో చాలా వ్యత్యాసం ఉంది. సీఎం ప్రజల వ్యక్తిగా ప్రజాస్వామికంగా పరిపాలన చేస్తారు. రాజు అనే వాడు పరిపాలన వ్యవస్థ గురించి ఎలాంటి ఆలోచన చేయడు. సీఎం ప్రజల మాటలు విని పరిపాలన కొనసాగిస్తారు. కాని రాజు అనేవాడు సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలతో ప్రజలతో సంబంధం లేకుండా పాలిస్తారు’’ అని రాహుల్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు ఎప్పుడు పిలిచినా వస్తాను..
‘‘తెలంగాణలో ఒక వ్యక్తి రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము మింగింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ప్రజలను మోసం చేసిన వారితో కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం ఉండదు. మోసపూరిత పార్టీలతో కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం ఉండదు. పొత్తు గురించి కాంగ్రెస్లో ఎవరు మాట్లాడినా బహిష్కరిస్తాం. తెరాస, భాజపాతో అనుబంధముండే వారు కాంగ్రెస్లో ఉండొద్దు. తెరాస, భాజపా ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయి. తెరాస, భాజపా మధ్య ఒప్పందం కుదిరింది. మోదీ ప్రభుత్వానికి తెరాస సహకరిస్తోంది. మోదీ 3 నల్ల చట్టాలను తీసుకొస్తే తెరాస సహకరించింది. తెలంగాణలో సొంతంగా గెలవలేమని భాజపాకు తెలుసు. వచ్చే ఎన్నికల్లో తెరాస, భాజపాను ఓడిస్తాం. తెలంగాణ యువతను మోసం చేసిన వారిని గద్దె దించుతాం. కాంగ్రెస్ విధివిధానాలను విమర్శిస్తే ఊరుకునేది లేదు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు పిలిచినా వస్తాను. ప్రజల అభిమానం పొందినవారికే ఈసారి టికెట్లు ఇస్తాం. నిజమైన ప్రజాసేవ ఎవరు చేస్తున్నారో పార్టీ గమనిస్తోంది. ప్రజల మధ్య ఉండని వారికి ఈసారి టికెట్లు దక్కవు’’ అని రాహుల్ తేల్చి చెప్పారు.
రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తాం..
రైతు సోదరులు ఆందోళన చెందవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తాం. మేం చెప్పేవి వట్టి మాటలు కాదు. తెలంగాణ రైతుల ప్రగతి కోసం మా మాటలు నిలబెట్టుకుంటాం. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. పలు కీలక అంశాలతో కూడిన వరంగల్ డిక్లరేషన్ను ఈ సభలో ప్రవేశపెట్టాం. ఇది కేవలం డిక్లరేషన్ కాదు.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది రైతులకు ఇచ్చే గ్యారెంటీ. ఈ రాష్ట్రంలోని రైతులు అందరూ డిక్లరేషన్ చదవాలి. రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా తీసుకొచ్చిందే ఈ డిక్లరేషన్. రైతులు బలహీనపడితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోలేదు. అలాంటి సందర్భంలో ఈ డిక్లరేషన్ రైతు సోదరులకు పునాదిగా మారుతుంది.
రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం: రేవంత్ రెడ్డి
‘‘తెలంగాణ అంటే మాకు ఆత్మగౌవరం. రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ చిన్నాభిన్నం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఎకరానికి రూ.15వేల పెట్టుబడి సాయం అందిస్తాం. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే కొంటుంది. పసుపు బోర్డును ఏర్పాటు చేసి పసుపు రైతులను ఆదుకుంటాం. పంటల బీమా పథకం అమలు చేసి నష్టపరిహారం వెంటనే అందజేస్తాం. భూమిలేని కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.12వేలు సాయం చేస్తాం. పోడు రైతులకు పట్టాలు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను రద్దు చేస్తాం. పెండింగ్ ప్రాజెక్టులను అన్నింటినీ పూర్తి చేస్తాం. చట్టపరంగా రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం. రైతును రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అది రాహుల్ గాంధీతోనే అది సాధ్యం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
రుణమాఫీ గురించి మాట్లాడటం లేదు: ఉత్తమ్కుమార్రెడ్డి
‘‘కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని తెరాస రైతులను మోసం చేస్తున్నాయి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రధాని మోదీ గొప్పగా చెప్పారు. మోదీ నిర్వాకం వల్ల రైతుల ఆదాయం తగ్గింది, ఖర్చు పెరిగింది. పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు భారీగా పెరిగి సాగు ఖర్చు రెట్టింపు అయింది. ఈ ఏడాది మిర్చి పంటకు తామర తెగులు సోకి రైతులు నష్టపోతే ఈ ప్రభుత్వాలు ఆదుకోలేదు. నాలుగేళ్లుగా రుణమాఫీ గురించి తెరాస ప్రభుత్వం మాట్లాడటం లేదు. దేశంలో పంటల బీమా అమలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ. ముస్లిం రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి కేసీఆర్ మోసం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను వేధించే వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. -
అయిదేళ్ల పాలనలో సర్వం నాశనం
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. -
అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. -
వసుంధర రాజెను పట్టించుకోని భాజపా
రాజస్థాన్కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి తిరుగులేని నేతగా ఒక వెలుగు వెలిగిన వసుంధర రాజె ఊసే ఈ ఎన్నికల్లో కనిపించడం లేదు. ఆమెను భాజపా పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. -
సిట్టింగులు పోయి.. కొత్తోళ్లు
భాజపా 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 303 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆ సిట్టింగ్ సీట్లలో ఈసారి ఇప్పటివరకు 130 చోట్ల వేర్వేరు కారణాల వల్ల అభ్యర్థులను మార్చింది. -
ప్రపంచాన యుద్ధమేఘాలు.. బలమైన భాజపా సర్కార్ అవసరం
ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధమేఘాలు ఆవరించాయని, ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు కాపాడాలంటే కేంద్రంలో బలమైన, స్థిరమైన భాజపా ప్రభుత్వం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. -
సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదు
సీఎం జగన్పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. -
షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్ నాటకం: వర్ల రామయ్య
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు.