Rahul Gandhi: ‘చింతన్ శివిర్’.. ఉదయ్పూర్కు రైలులోనే రాహుల్!
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ నెల 13 నుంచి 15 వరకు జరగబోయే కాంగ్రెస్ మేథోమధన సదస్సు ‘చింతన్ శివిర్’కు ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సదస్సులో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు కీలక నేతలు దిల్లీ నుంచి రైలులోనే...
దిల్లీ: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ నెల 13 నుంచి 15 వరకు జరగబోయే కాంగ్రెస్ మేథోమధన సదస్సు ‘చింతన్ శివిర్’కు ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సదస్సులో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు కీలక నేతలు దిల్లీ నుంచి రైలులోనే బయల్దేరి వెళ్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం రైలులో రెండు బోగీలు బుక్ చేసుకున్నట్టు సమాచారం. సోమవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రైలులో ఉదయ్పూర్కు వెళ్లాలన్న తన ప్రణాళికను రాహుల్ ప్రకటించినట్టు తెలుస్తోంది. అయితే చింతన్ శివిర్కు మిగతా నేతలు ఎలా వెళ్లాలనే నిర్ణయాన్ని వారి ఇష్టానికి వదిలిపెట్టారు. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేశ్, వివేక్ బన్సాల్తో పాటు మొత్తంగా 50 మందికి పైగా నేతలు రైలులోనే ఉదయ్పూర్కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ సదస్సులో 422 మంది నేతలు పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ఇటీవల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రైలులోనే కాన్పూర్ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా అదే తరహాలో వెళ్లాలని నిర్ణయ తీసుకోవడం గమనార్హం. తద్వారా తాము సామాన్యులమనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం