ఏడేళ్లలో దేశాన్ని నాశనం చేశారు.. కేంద్రంపై రాహుల్, ప్రియాంక విమర్శలు
ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విమర్శల వర్షం కురిపించారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.
జైపూర్: ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విమర్శల వర్షం కురిపించారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఏడేళ్ల కాలంలో దేశాన్ని నాశనం చేశారని ఆరోపించారు. రాజస్థాన్లోని జైపూర్లో ఆదివారం కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, మల్లికార్జున్ ఖర్గే తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హిందు, హిందుత్వ అంశంపై మరోసారి రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హిందువునని, హిందుత్వ వాదిని కాదని పేర్కొన్నారు. భారత్ హిందువుల దేశమని, హిందుత్వవాదులది కాదన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులు అల్లాడుతున్నా.. అధికారం కోసం పాకులాడేవారే హిందుత్వ వాదులంటూ భాజపా నేతలనుద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. మోదీ, ఆయన స్నేహితులు ఏడేళ్లుగా దేశాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.
70 ఏళ్లలో కాంగ్రెస్ సాధించినదాన్ని భాజపా ప్రభుత్వం తన స్నేహితులకు దోచిపెట్టిందని ప్రియాంక విమర్శించారు. ఎన్నికలు వచ్చేసరికి వారికి కులమో, మతమో, చైనానో ఇంకో దేశమో గుర్తొస్తుందని దుయ్యబట్టారు. ప్రజల కష్టాలు మాత్రం వారికి గుర్తుకురావని ఎద్దేవాచేశారు. ‘‘70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు. ఆ సంగతి పక్కన పెట్టండి. ముందు మీరు ఈ ఏడేళ్లలో ఏంచేశారో అది చెప్పండి’’ అని ప్రియాంక ఎదురు ప్రశ్నించారు. రైతులుకు ఎరువులు ఇవ్వడంలో విఫలమైన యోగి ఆదిత్యనాథ్ సర్కారు.. ప్రకటనల కోసం మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం