Congress: అధ్యక్షుడు కాకపోయినా రాహులే మన నేత
కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు కోరుతూ గతంలో అధిష్ఠానానికి లేఖ రాసి జి-23గా ముద్రపడ్డ సొంత పార్టీ వర్గంపై తాజాగా సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మండిపడ్డారు...
సొంత పార్టీలోని జి-23 వర్గంపై సల్మాన్ ఖుర్షీద్ మండిపాటు
దిల్లీ: కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు కోరుతూ గతంలో అధిష్ఠానానికి లేఖ రాసి జి-23గా ముద్రపడ్డ సొంత పార్టీ వర్గంపై తాజాగా సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మండిపడ్డారు. పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని బహిరంగంగా డిమాండ్ చేయడాన్ని తప్పుబట్టారు. లేఖ రాసిన వారంతా ప్రస్తుతం వారున్న హోదాలకు ఎన్నికల వల్లే ఎదిగారా? అని ప్రశ్నించారు. సంస్కరణలు త్యాగాల వల్లే సాధ్యమని.. ఆకస్మికంగా ప్రశ్నించడం వల్ల కాదని హితవు పలికారు.
‘కాంగ్రెస్ పార్టీకి పెద్దాపరేషన్ చేయాలి’అంటూ జి-23 వర్గంలోని నేత వీరప్ప మొయిలీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనికి స్పందనగానే ఖుర్షీద్ తాజా వ్యాఖ్యలు చేశారు. అద్భుతమైన వాక్యాలు పరిష్కారం చూపలేవని ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లుగా పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలకు చర్చల ద్వారా ఓ పరిష్కారం చూపాలని హితవు పలికారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలా? లేదా? అనేది రాహుల్ గాంధీయే నిర్ణయించుకుంటారని తెలిపారు. అయితే, పార్టీ అధ్యక్షుడి స్థానంలో ఉన్నా.. లేకపోయినా.. ఆయనే పార్టీ నాయకుడని వ్యాఖ్యానించారు.
‘‘పార్టీకి ఆపరేషన్ చేద్దాం, సంస్కరణలు తీసుకొద్దాం, సంస్థాగతంగా మార్పులు చేద్దాం.. అనడంలో ఉద్దేశమేంటనేది నాకు అర్థం కావడం లేదు. దీనిపై వాళ్లు(జి-23) స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరుతున్నా. పార్టీ పదవుల్లో మార్పులు చేసి వారికి కీలక పదవులు కట్టబెట్టాలనేది వారి ఉద్దేశమా?ఆపరేషన్, సంస్కరణలు అనడంలో వారి అర్థం అదేనా? ఒకవేళ అదే వారు కోరుకుంటే దాన్ని వారు సంస్కరణలు, ఆపరేషన్లు అనడం సబబు కాదు. అది కేవలం ‘నాకు పదవి కావాలి అని కోరుకోవడమే’ అవుతుంది. అందుకే దీనిపై చర్చ జరగాలి అంటున్నాను’’ అని సల్మాన్ ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు. పార్టీలో సంస్కరణలు కోరుకుంటున్నవారు ఈ విషయాన్ని పార్టీలోని ఇతర నేతలతో ముందే చర్చించి ఉండాల్సిందన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్దదని.. ఒకవేళ పార్టీలో ప్రతి స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలంటే ‘భారత ఎన్నికల సంఘం’వలే ఓ ప్రత్యేక వ్యవస్థే కావాల్సి వస్తుందన్నారు. పార్టీలో సంస్కరణలు కావాలనుకుంటే కూర్చొని మాట్లాడాలని.. మీడియా దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
అయినప్పటికీ అంతర్గత ఎన్నికల నిర్వహణకు వెనుకాడడం లేదని ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు. గుమికూడి ఓటు వేసే పరిస్థితులు ఇప్పుడు లేవని తెలిపారు. పార్టీకి, దేశానికి ఏది మంచిదో అదిష్ఠానానికి బాగా తెలుసని.. దీనిపై తుది నిర్ణయం వారే తీసుకుంటారన్నారు. అలాగే కొవిడ్ సంక్షోభంలో అహ్మద్ పటేల్, మోతీలాల్ వోరా వంటి కీలక నేతలు మరణించడం కూడా పార్టీ ఎన్నికల నిర్వహణలో జాప్యానికి ఓ కారణమని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండో విడత నామినేషన్లకు శ్రీకారం
లోక్సభ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఈ విడతలో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 సీట్లకు వచ్చే నెల 26వ తేదీన పోలింగ్ జరగనుంది. -
మమతకు మృత్యుఘంటిక మోగుతోంది
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మృత్యుఘంటిక మోగడం మొదలైందని తమ్లుక్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్య సరికొత్త దుమారానికి కారణమైంది. -
భాజపా మ్యానిఫెస్టో అంశాలపై చర్చ
భాజపా మ్యానిఫెస్టోలో తెలిపిన అంశాలపై ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చర్చించింది. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నేతృత్వంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశమైంది. -
పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ను ఆర్థికంగా కుంగదీయడానికే బ్యాంకు ఖాతాల స్తంభన
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ను ఆర్థికంగా కుంగదీయడానికి ఆదాయ పన్ను కట్టలేదనే సాకుతో బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతా పాల్ ఆరోపించారు. -
రూ. 700 కోట్ల ఆస్తి.. ఒక్క వాహనమూ లేదు
కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.700 కోట్లుగా ప్రకటించారు. -
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్