Rahul Gandhi: దేశ సగం సంపదంతా 100 మంది చేతుల్లోనే..!
దేశ సంపదలో సగం కేవలం 100 మంది చేతుల్లోనే ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డ ఆయన.. నరేంద్ర మోదీ నాయకత్వంలో సామాన్యుడికి మిగులుతోంది శూన్యమని దుయ్యబట్టారు.
దిల్లీ: భారత్ జోడో యాత్రను (Bharat Jodo Yatra) కొనసాగిస్తోన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. కేంద్రంలో భాజపా ప్రభుత్వ విధానాలపై మరోసారి మండిపడ్డారు. మొన్నటివరకు నోట్లరద్దు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ఆయన.. తాజాగా అగ్నిపథ్, జీఎస్టీలపై ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టారు. పాదయాత్రలో భాగంగా హరియాణాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. కేవలం కొంతమంది సంపన్నులకే ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వ విధానాలున్నాయంటూ దుయ్యబట్టారు.
‘ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో రెండు భారత్లు ఉన్నాయి. ఒకటి రైతులు, కార్మికులు, చిన్న దుకాణాలతో పాటు నిరుద్యోగులది. దేశంలోని సగం సంపద పోగుపడి ఉన్న 100 మందిది రెండోది. లాభాల్లో 90శాతం 20 కంపెనీల్లోనే ఉంది. కానీ, సామాన్యుడి చేతిలో మాత్రం శూన్యం. నోట్లరద్దు, జీఎస్టీలు కేవలం ప్రభుత్వ విధానాలే కాదు.. అవి చిన్న, మధ్యతరహా వ్యాపారాలను నాశనం చేసే ఆయుధాలు. ఇక అగ్నిపథ్ అంటే అర్థమేంటో నాకు తెలియదు. దేశభక్తులని చెప్పుకొనే భాజపా నేతలు దాని గురించి విడమరిచి చెప్పాలి’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
హరియాణాలోని భాజపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ.. దేశంలో అత్యంత నిరుద్యోగిత రేటు ఉన్న రాష్ట్రం ఇదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 38శాతంగా ఉందన్న రాహుల్ గాంధీ.. ‘21శతాబ్దంలో నిరుద్యోగంలో హరియాణా ఛాంపియన్గా నిలిచింది. దేశంలో అన్ని రాష్ట్రాలను మించిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్