Sachin Pilot: అవినీతిని ప్రశ్నించకపోతే.. ఎన్నికల్లో గెలవలేం: సచిన్ పైలట్
అవినీతిని ప్రశ్నించకపోతే ఎన్నికల్లో విజయం సాధించలేమని రాజస్థాన్ (Rajasthan) మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ (Sachin Pilot) అన్నారు. రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా అజ్మేర్ నుంచి జైపుర్ వరకు చేపట్టిన పాదయాత్ర రెండో రోజుకు చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జైపుర్: కర్ణాటక (Karnataka Elections 2023)లో భాజపా (BJP) ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించడం వల్లనే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) గెలవబోతోందని రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ (Sachin Pilot) అన్నారు. జన్ సంఘర్ష్ యాత్ర (Jan Sangharsh Yatra) పేరుతో అజ్మేర్ నుంచి జైపుర్ వరకు ఆయన చేపట్టిన పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మరోసారి సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేశారు.
‘‘కర్ణాటకలో 40శాతం కమీషనుపై భాజపా ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించాం. కాబట్టే, అక్కడ కాంగ్రెస్ గెలవబోతోంది. సీఎం బొమ్మై ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేయడం వల్లనే అక్కడి ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం కలిగింది. అదేపనిని మనం రాజస్థాన్లో కూడా చేయాలి. ఈ నాలుగున్నర ఏళ్లలో పని చేయకపోతే, ప్రజలకు పార్టీపై ఎలా నమ్మకాన్ని కల్పిస్తాం. నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. ఏ ఒక్కరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడంలేదు. ఈ యాత్ర యువత ఆశయాల కోసం అవినీతికి వ్యతిరేకంగా చేపట్టాను. ఆరు నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో ప్రజలు ఏం చెప్పి ఓట్లు అడుగుతాం?’’ అని సచిన్ పైలట్ ప్రశ్నించారు.
గత కొంత కాలంగా రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య విభేదాలు తరచూ పొడచూపుతున్నాయి. మాజీ సీఎం, భాజపా నేత వసుంధర రాజే (Vasundhara Raje) తన ప్రభుత్వాన్ని కాపాడారంటూ ఇటీవల గహ్లోత్ వ్యాఖ్యానించగా.. ఆమెను గహ్లోత్ తన నాయకురాలిగా భావిస్తున్నారంటూ పైలట్ మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే అవినీతికి, రాష్ట్రంలో పోటీ పరీక్షల పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా పైలట్ గురువారం పాదయాత్రను ప్రారంభించారు. వర్గ విభేదాలను సృష్టించేవారు ఎప్పటికీ విజయం సాధించలేరని, పార్టీకి విధేయులుగా ఉండలేరని సచిన్ పైలట్ను ఉద్దేశించి ఓ కార్యక్రమంలో సీఎం అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. సచిన్ పైలట్ చేపట్టిన యాత్ర పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, పార్టీతో ఎలాంటి సంబంధంలేదని రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) స్పష్టంచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట