Sachin Pilot: వెంటనే సీఎం పదవి ఇస్తారా లేదా?.. కాంగ్రెస్కు సచిన్ పైలట్ డిమాండ్
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో మరో కుదుపు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సీనియర్ నేత సచిన్ పైలట్ పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్లో మరో కుదుపు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సీనియర్ నేత సచిన్ పైలట్ పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. లేదంటే పంజాబ్లో మాదిరిగానే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ఓటమి తప్పదని చెప్పినట్లు తెలుస్తోంది. రాజస్థాన్లో నాయకత్వ మార్పు జరగనున్నట్లు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోన్న వేళ.. తాజా కథనాలు ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.
ఇటీవల సచిన్ పైలట్ పలు మార్లు దిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరిపారు. సోనియా గాంధీతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు. మరో ఏడాదిన్నరలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తనకు తక్షణమే సీఎం పగ్గాలు అప్పగించాలని పైలట్.. కాంగ్రెస్ హైకమాండ్ను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యంగా చేసిన పంజాబ్ పరిణామాలు రాజస్థాన్లో పునరావృతమవుతాయని హెచ్చరించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.
పైలట్ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తానని ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే తాను రాజస్థాన్ వీడి రాలేనని పైలట్ గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. అది కాదంటే.. రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిని చేస్తామని హైకమాండ్ మాట ఇచ్చింది.పై రెండు ఆఫర్లు వద్దంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పైలట్ నేతృత్వంలోనే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తుందని, ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం పదవి చేపట్టొచ్చని హైకమాండ్ చెప్పినట్లు సమాచారం. వీటిని కూడా పైలట్ తిరస్కరించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో తాను ఐదేళ్ల పాటు రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్గా వ్యవహరించానని, అప్పుడే 2018లో కాంగ్రెస్ గెలిచిందని చెప్పారట.
ఇప్పటికే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో దిగులులో కూరుకుపోయిన హస్తం పార్టీకి పైలట్ డిమాండ్ కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. దీనిపై ఎమ్మెల్యేలు, రాజస్థాన్ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి హైకమాండ్ నిర్ణయం తీసుకోనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మే 13-15వ తేదీల్లో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కాంగ్రెస్ చింతన్ శిబిరం నిర్వహించనుంది. దీని అనంతరం పార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
మరోవైపు సీఎం మార్పు ఊహాగానాలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఇటీవల స్పందించారు. రాజీనామా చేయాలని అధిష్ఠానం కోరితే అందుకు ఎప్పుడూ సిద్ధమేనన్నారు. తన రాజీనామా లేఖ ఎల్లప్పుడూ సోనియా గాంధీ వద్దే ఉంటుందని తెలిపారు.
రాజస్థాన్ కాంగ్రెస్లో అంతర్గతంగా వివాదాలు ఎప్పట్నుంచో కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం సీఎం అశోక్ గహ్లోత్కు వ్యతిరేకంగా పైలట్ సహా మరో 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో అశోక్, పైలట్ వర్గం మధ్య నెలకొన్న విభేదాలు ఈ అమస్మతికి కారణమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్ఠానం పైలట్ను బుజ్జగించింది. పైలట్ వర్గీయులకు గెహ్లోత్ కేబినెట్లో చోటు కల్పించింది. ఈ వివాదం అప్పట్లో సద్దుమణిగినట్లే కన్పించినా.. గత నెల పైలట్ మళ్లీ గాంధీలను కలవడంతో మరోసారి ఊహాగానాలు జోరందుకున్నాయి. రాజస్థాన్లో 2023 డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
కాకినాడ జిల్లా కొత్తపల్లిలో తెదేపా నేతలు, కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా సీనియర్ నేత కనకమేడల రవీంద్ర మరో లేఖ రాశారు. సీఎంపై రాయి దాడి కేసులో బొండా ఉమాను ఇరికించేలా వ్యవహరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. -
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదు
సీఎం జగన్పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. -
షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్ నాటకం: వర్ల రామయ్య
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు. -
అభ్యర్థుల ఆస్తులు.. అప్పులు.. కేసులు..
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డిపై కేసు
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిపై ఆదిభట్ల పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు నమోదైంది. -
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు: జగ్గారెడ్డి
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు, గ్రాఫిక్ లీడర్స్ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!