షా సమక్షంలో భాజపాలోకి టీఎంసీ నేతలు

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు కీలక నేతలు శనివారం దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో భాజపాలో చేరారు.

Published : 31 Jan 2021 01:21 IST

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు కీలక నేతలు శనివారం దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో భాజపాలో చేరారు. మాజీ మంత్రి రజిబ్‌ బెనర్జీ సహా, వైశాలీ దాల్మియా, ప్రబిర్‌ ఘోషాల్‌, రతిన్‌ చక్రవర్తి, రుద్రానిల్‌ ఘోష్‌ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయాన్ని అమిత్‌షా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. వీరి చేరిక ‘సోనార్‌ బంగ్లా’ సాకారం కోసం భాజపా చేస్తున్న పోరాటాన్ని మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు.  శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో కోల్‌కతా నుంచి దిల్లీకి చేరుకున్న వీరంతా ముందుగా అమిత్‌షాతో భేటీ అయ్యారు. అనంతరం పార్టీలో చేరారు.

తొలుత ఈ ఐదుగురు నేతలు ఆదివారం జరగబోయే అమిత్‌షా సమావేశంలో భాజపాలో చేరాల్సి ఉన్నప్పటికీ.. షా బెంగాల్‌ పర్యటన రద్దు కావడంతో శనివారం దిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. కాగా ఆదివారం హౌరాలో జరగనున్న బహిరంగ సభలో అమిత్‌షా వర్చువల్‌గా పాల్గొననున్నారు. 

ఇదీ చదవండి

దిల్లీ పేలుడు ఆ ఉగ్రవాదుల పనేనా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని