- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Manmohan Singh: భాజపా వైఫల్యాలకు.. తొలి ప్రధాని నెహ్రూపై నిందలా..?
మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ ప్రధాని
దిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న వేళ.. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రతి సమస్యకూ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే నిందిస్తున్నారంటూ ప్రధాని మోదీపై ఆరోపణలు గుప్పించారు. ప్రధానమంత్రి పదవికి ప్రత్యేక గౌరవం ఉందన్న మన్మోహన్ సింగ్.. రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని ఎప్పుడూ విభజించడం, వాస్తవాలు దాచలేదంటూ మోదీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఫిబ్రవరి 20న పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మాజీ ప్రధాని వీడియో సందేశం విడుదల చేశారు.
‘ఓవైపు దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. మరోవైపు రైతుల ఆందోళనలు, విదేశీ విధానం వంటి కీలక అంశాల్లోనూ కేంద్ర ప్రభుత్వం సరైన విధానాలను అనుసరించడం లేదు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లకుపైగా అవుతోంది. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఒప్పుకోవడం, వాటిని సరిదిద్దుకోవడం కంటే ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇంకా తొలి ప్రధానమంత్రి నెహ్రూనే కారణమంటూ నిందిస్తున్నారు’ అని మన్మోహన్ సింగ్ మండిపడ్డారు.
ఇక కొన్నిరోజుల క్రితం పంజాబ్లో పర్యటించిన ప్రధానమంత్రి కాన్వాయ్లో భద్రతా లోపం పేరుతో ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్తోపాటు రాష్ట్ర ప్రజలను అపఖ్యాతి చేసే ప్రయత్నం జరిగింది. అంతకుముందు రైతుల ఆందోళనల సమయంలోనూ పంజాబ్ ప్రభుత్వం, పంజాబీలను కించపరిచే యత్నం జరిగింది. దేశభక్తి, ధైర్య సాహసాలు, పంజాబీల త్యాగాలను యావత్ ప్రపంచం కొనియాడుతుంది. కానీ, ఎన్డీయే ప్రభుత్వం మాత్రం వీటిలో ఏ ఒక్క విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించదు’ అంటూ మోదీ ప్రభుత్వంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు.
ఇదిలాఉంటే, పంజాబ్లో ఫిబ్రవరి 20న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ఆయా పార్టీలు ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ, ఎన్డీయే కూటమి మధ్య హోరాహోరి పోరు కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పంజాబ్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
-
World News
Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
-
India News
Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
-
Sports News
Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
-
Technology News
Noise Smartwatch: ఫోన్ కాలింగ్, హెల్త్ సూట్ ఫీచర్లతో నాయిస్ కొత్త స్మార్ట్వాచ్
-
Movies News
Puri Jagannadh: ఛార్మితో రిలేషన్షిప్పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్షిప్పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Rahul Gandhi: మోదీజీ.. సిగ్గుచేటుగా అనిపించడం లేదా..! రాహుల్ ఫైర్
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఎక్స్ఛేంజ్లో విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- Chiranjeevi: మెగా హీరోలను కలవాలనుకుంటున్నారా? మీకిదే అవకాశం!