Andhra News: 12ఏళ్ల తర్వాత రాజీపడిన రాయపాటి, కన్నా లక్ష్మీనారాయణ

దాదాపు 12ఏళ్ల తర్వాత గుంటూరుకు చెందిన సీనియర్‌ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, రాయపాటి సాంబశివరావు మధ్య సఖ్యత కుదిరింది. తన వ్యాఖ్యలను రాయపాటి ఉపసంహరించుకోగా, పరువునష్టం దావాను కన్నా వెనక్కి తీసుకున్నారు.

Published : 02 Nov 2022 01:24 IST

గుంటూరు: గుంటూరుకు చెందిన సీనియర్‌ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, రాయపాటి సాంబశివరావు ఎట్టకేలకు కోర్టులో రాజీపడ్డారు. 2010లో రాయపాటి చేసిన వ్యాఖ్యలపై కన్నా .. అప్పట్లో రూ.కోటికి పరువునష్టం దావా వేశారు. ఈ వివాదంపై విచారణ ముగిసింది. ఇద్దరినీ కోర్టుకు రమ్మని న్యాయస్థానం ఆదేశించగా.. మంగళవారం 4వ అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి ఎదుట ఇరువురు నేతలూ హాజరయ్యారు. దాదాపు 12ఏళ్ల తర్వాత వీరి మధ్య సఖ్యత కుదిరింది. తన వ్యాఖ్యలను రాయపాటి ఉపసంహరించుకోగా, పరువునష్టం దావాను కన్నా వెనక్కి తీసుకున్నారు. న్యాయమూర్తి సమక్షంలో ఇద్దరు నేతలు రాజీకి వచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని