Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
మహారాష్ట్రలో భాజపా రాజకీయ ప్రణాళికలో ఇప్పటి వరకు చూసింది కేవలం ట్రైలర్ వంటిదే. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీ భారీ వ్యూహాన్నే అనుసరిస్తోంది. దీనిలో భాగంగా
కుంభస్థలానికి గురిపెట్టిన భాజపా
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
మహారాష్ట్రలో భాజపా రాజకీయ ప్రణాళికలో ఇప్పటి వరకూ చూసింది కేవలం ట్రైలరే. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీ భారీ వ్యూహాన్నే అనుసరిస్తోంది. దీనిలో భాగంగా శివసేనను చీల్చి రెబల్స్కు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించింది. దేవేంద్ర ఫడణవీస్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించేలా అధినాయకత్వం ఒప్పించింది. మహారాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రులుగా చేసిన వారు తర్వాత సాధారణ మంత్రులుగా చేసిన సందర్భాలున్నాయి. గతంలో నారాయణ్ రాణే, అశోక్ చవాన్లే దీనికి ఉదాహరణలు. ఈ నేపథ్యంలో ఫడణవీస్ ఇమేజ్కు వచ్చే మచ్చ ఏమీలేదు.
శిందే పూర్తిగా భాజపా ఎంపికే..
గతంలో భాజపా నాయకత్వాన్ని అబద్ధాల కోరులుగా ఉద్ధవ్ ఠాక్రే అభివర్ణించారు. అంతేకాదు.. 2019లో భాజపాను వీడి కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టుకట్టారు. ఈ విషయాలను కమలనాథులు బాగా గుర్తుపెట్టుకొన్నారు. ఇప్పుడు ఉద్ధవ్ను పార్టీ పరంగా పూర్తిగా బలహీనపర్చే వ్యూహాన్ని అమల్లోకి తెచ్చారు. శివసేనను చీల్చకుండానే.. శిందే రూపంలో రెబల్ శివసైనికుడికి సీఎం పదవిని అప్పగించారు. ఫలితంగా కార్యకర్తల్లో శిందే పలుకుబడి గణనీయంగా పెరిగి.. రాజకీయంగా ఉద్దవ్ పలుకుబడి తగ్గిపోతుంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. అధికారాన్ని లాక్కొన్నారని శివసైనికులు భాజపాపై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం లేదు. 2024 ఎన్నికలకు ముందు శిందే వర్గం ఏ స్థాయిలో బలపడిందో తెలుసుకొనేందుకు బీఎంసీ ఎన్నికలే లిట్మస్ టెస్ట్గా నిలవనున్నాయి.
ఠాక్రే కుటుంబ పునాదులను కదలించేలా..
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లలో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు దాదాపు 15 మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తు, నగర్ పరిషత్లకు ఎన్నికలు జరుగుతాయి. వీటిల్లో చాలా వరకు స్థానిక సంస్థల్లో ఠాక్రే కుటుంబానికి మంచి పట్టుంది. ఇవే ఆ కుటుంబానికి బలం, పలుకుబడి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో బడ్జెట్ కలిగి ఉన్న బీఎంసీపై శివసేన పట్టు తగ్గించడం భాజపాకు కీలకంగా మారింది. తాజాగా శివసేన రెబల్స్ చేతికి సీఎం పగ్గాలు వెళ్లడంతో స్థానిక సంస్థల్లో ఠాక్రే కుటుంబ ప్రభావాన్ని తగ్గించడం భాజపాకు సులువవుతుంది. దీనికి తోడు ఏక్నాథ్ శిందేకు ఠాణే, కల్యాణ్-డోంబివాలి మహానగర్ పాలికల్లో మంచి పట్టుండటం భాజపాకు కలిసొచ్చే అంశం.
అంతేకాదు భవిష్యత్తులో పార్టీ గుర్తు కోసం జరిగే న్యాయ పోరాటంలో రెబల్స్కు మద్దతు పెరగాలంటే సీఎం కుర్చీ శిందే చేతిలో ఉండటమే సరైన నిర్ణయంగా భాజపా అధినాయకత్వం భావించింది. పార్టీ గుర్తును, నిధులను ఉద్ధవ్ నుంచి దూరం చేస్తే సగం విజయం సాధించినట్లే అని ఫడణవీస్ వర్గం భావిస్తోంది.
ఫలితం ఏదైనా విజయం భాజపాకే దక్కేలా వ్యూహం..
భాజపా, శివసేనలకు హిందుత్వ అజెండా ప్రధానం. 1989లో భాజపా-శివసేన తొలిసారి జట్టుకట్టాయి. ఆ తర్వాత వీరి భాగస్వామ్యంలో 1995-99, 2014-19లలో రాష్ట్రంలో అధికారం దక్కించుకొంది. కానీ, 2014-19 భాజపా బాగా బలపడటంతో శివసేనతో విభేదాలు మొదలయ్యాయి. దీంతో 2017 బీఎంసీ ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోరాడాయి. 2019 ఎన్నికల్లో కలిసి పోరాడినా.. ఫలితాల అనంతరం ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టు కట్టేందుకు మొగ్గుచూపారు. దీంతో హిందుత్వకు తానే సారథిగా చెప్పుకునేలా అయాచిత వరం భాజపాకు దక్కింది. మరోవైపు తమ పునాదులు దెబ్బతింటాయనే భయం శివసేన నాయకుల్లో అంతర్గతంగా పెరిగిపోవడమే తిరుగుబాటుకు కారణమైంది. ఇది కూడా ఓ రకంగా కమలనాథులకు కలిసొచ్చే అంశమే. శివసేన కేడర్లో చీలికలు ఆ పార్టీని బలహీన పరుస్తాయి. భవిష్యత్తులో శిందే వర్గం, ఉద్ధవ్ వర్గాలకు ఎన్నికల్లో విజయాలు అంతతేలిగ్గా దక్కవు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆ స్థానాన్ని భాజపా భర్తీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sita Soren: జేఎంఎంకు షాక్..! భాజపాలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు
జేఎంఎం అధినేత శిబూ సోరెన్ పెద్ద కోడలు, ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ మంగళవారం భాజపాలో చేరారు. -
AP News: ఈ ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ
ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మాదిగలకు సంక్షేమం లేకుండా చేసిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. -
Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్రావు
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని భారాస (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) డిమాండ్ చేశారు. -
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే
భాజపా ఇచ్చిన హామీలకు 2004 ఫలితాలే పునరావృతం అవుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. -
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్కు సీఎంవో నుంచి పిలుపు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైకాపా (YSRCP) పంచాయితీ తాడేపల్లికి చేరింది. అక్కడి వైకాపా నేత మల్లెల రాజేశ్ నాయుడుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. -
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
Pashupati Paras: కేంద్రమంత్రి పశుపతి కుమార్ పరాస్ తన పదవికి రాజీనామా చేశారు. బిహార్లో చిరాగ్ పాసవాన్కు చెందిన ఎల్జేపీ (రాంవిలాస్)తో భాజపా పొత్తు పెట్టుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. -
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
తెదేపా (TDP) ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కసరత్తు చేస్తున్నారు. -
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు వైకాపా నేతలపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ
ప్రజలతో మమేకమయ్యేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి లోకేశ్ సోమవారం ‘రచ్చబండ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ప్రధాని సభలో ఇంత భద్రతా వైఫల్యమా?
‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. -
జనం తోసుకుంటుంటే చోద్యం చూశారు
ప్రధాని మోదీ పాల్గొన్న బొప్పూడి ప్రజాగళం సభకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ధ్వజమెత్తారు. -
ప్రభుత్వ వెబ్సైట్లలో ఫొటోలు తొలగించాలి
ప్రభుత్వశాఖల వెబ్సైట్లలో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. -
ప్రధాని సభకు ఆటంకాల వెనుక జగన్ హస్తం
ప్రధానమంత్రి పాల్గొన్న ప్రజాగళం సభకు ఆటంకాలు సృష్టించడం వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. -
లక్షల మంది తరలివచ్చి కూటమిని ఆశీర్వదించారు
చిలకలూరిపేటలో భాజపా, తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వంటిది ఈ దశాబ్దంలో చూడలేదని జనం చెబుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపు చేపడితే మేలు
ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపును చేపట్టాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. -
జగన్ అరాచక పాలనకు మోదీ అండ: సీపీఐ
వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను సీబీఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. -
కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్ యథావిధిగా జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. -
వైకాపా అధిష్ఠానానికి నగరి అసమ్మతి నేతల ఝలక్
చిత్తూరు జిల్లా నగరి సీటును మంత్రి రోజాకు కేటాయిస్తే తాము పని చేయమని వైకాపా అసమ్మతి నేతలు తెగేసి చెప్పినా, రెండ్రోజుల క్రితం ఆమె అభ్యర్థిత్వాన్నే జగన్ ఖరారు చేశారు. -
కడపలోనూ కొండలు కొల్లగొట్టేశారు...
ముఖ్యమంత్రి జగన్ సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో కొండలు, గుట్టలను వైకాపా నేతలు అయిదేళ్లుగా వరుసబెట్టి మింగేశారు. -
హిందూమతం అంతమే వారి లక్ష్యం
దేశంలో హిందూమతాన్ని, శక్తి ఆరాధనను అంతం చేసేందుకు ఇండియా కూటమి కంకణం కట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
CAA: సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం
-
Sita Soren: జేఎంఎంకు షాక్..! భాజపాలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు
-
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు
-
తెలంగాణ నూతన గవర్నర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
-
Nitin Gadkari: అమితాబ్ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు