Priyanka Chaturvedi: రాజకీయ సంక్షోభంపై బెదిరింపు కాల్స్.. పోలీసులను ఆశ్రయించిన శివసేన ఎంపీ
మహారాష్ట్ర రాజకీయాల్లో సీఎం ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray), తిరుగుబాటు నేత ఏక్నాథ్ శిందే(Eknath Shinde) మధ్య పోరు సాగుతోన్న వేళ.. శివసేన(Shivsena) ఎంపీ ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi)...
ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో సీఎం ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray), తిరుగుబాటు నేత ఏక్నాథ్ శిందే(Eknath Shinde)ల మధ్య పోరు సాగుతోన్న వేళ.. శివసేన(Shivsena) ఎంపీ ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi) శనివారం పోలీసులను ఆశ్రయించారు. తనకు అసభ్య, బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల మీద శుక్రవారం నుంచి బెదిరింపు, అసభ్య కాల్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని ముంబయి(Mumbai) పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే దృష్టికి తీసుకెళ్లా. త్వరలో నిందితులను పట్టుకుంటారని ఆశిస్తున్నా’నంటూ ఆమె ఓ ట్వీట్ చేశారు.
హిందుత్వ సిద్ధాంతం నుంచి శివసేన దారిమళ్లుతోందంటూ ఇటీవల ఏక్నాథ్ శిందే చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక చతుర్వేది విరుచుకుపడిన విషయం తెలిసిందే. కుటుంబంలా ఉన్న పార్టీని వెన్నుపోటు పొడవాలని ఏ హిందుత్వ నేర్పుతుందంటూ మండిపడ్డారు. శిందే తిరుగుబాటుకు ఇది కారణం కాదని, ఆయన వెనుక భాజపా ఉందని ఆరోపించారు.
ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. శిందే వర్గం కొత్త పార్టీపై ప్రకటన చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. మరోపక్క అసమ్మతి ఎమ్మెల్యేల వైఖరిని నిరసిస్తూ.. శివసేన కార్యకర్తలు రాష్ట్రంలో పలు చోట్ల నిరసనలు చేపడుతున్నారు. దీంతో హోం శాఖ రాజధాని నగరం ముంబయిలో 144 సెక్షన్ విధించింది. హై అలర్ట్ ప్రకటించి, అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు