Telangana News: తెలంగాణలో రాహుల్‌ పర్యటన.. రేవంత్‌, కవిత ట్వీట్‌ వార్‌

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెరాస ఎమ్మెల్సీ కవిత మధ్య ట్వీట్‌ వార్‌ నడుస్తోంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ నేడు, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు.

Updated : 06 May 2022 11:53 IST

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెరాస ఎమ్మెల్సీ కవిత మధ్య ట్వీట్‌ వార్‌ నడుస్తోంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ నేడు, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌పై కవిత విమర్శలు చేశారు. రాష్ట్ర హక్కుల కోసం.. దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై తెరాస పోరాడుతున్నప్పుడు రాహుల్‌ ఎక్కడున్నారని ఆమె ట్విటర్‌లో ప్రశ్నించారు. 

దీనికి రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. రైతు వ్యతిరేక చట్టాలను ప్రధాని మోదీ తెచ్చినప్పుడు మీరెక్కడున్నారని ప్రశ్నించారు. ‘‘మీ తండ్రి మోదీ ముందు మోకరిల్లి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు ఉరి తాళ్లు బిగించినప్పుడు మీరు ఎక్కడ?’’ అని రేవంత్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని