Congress: ఓయూలో నిరుద్యోగ మార్చ్.. రేవంత్ సహా కాంగ్రెస్ నేతల గృహనిర్బంధం
ఓయూ జేఏసీ నిరుద్యోగ మార్చ్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
హైదరాబాద్: ఓయూ జేఏసీ నిరుద్యోగ మార్చ్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నిరుద్యోగ మార్చ్కు హాజరై సంఘీభావం ప్రకటిస్తానని రేవంత్ వెల్లడించిన నేపథ్యంలో ఆయన్ను నిర్బంధించారు.
జూబ్లీహిల్స్లోని నివాసం నుంచి రేవంత్ బయటకు రాకుండా అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఆ మార్గంలో బారికేడ్లు పెట్టారు. స్థానికులను సైతం తనిఖీ చేస్తున్నారు. వారి గుర్తింపు కార్డులను పరిశీలించాకే ఆ ప్రాంతంలోకి అనుమతిస్తున్నారు. మరోవైపు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కాంగ్రెస్ నేతలు అంజన్కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్, ఈరవత్రి అనిల్, సంకేపల్లి సుధీర్రెడ్డితో పాటు ఓయూ జేఏసీకి చెందిన పలువురు నేతలను కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా నిరుద్యోగ మార్చ్కు ఓయూ విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ముఖ్యనేతలు సహా ఆ పార్టీ కార్యకర్తలు భారీగా హాజరవుతారని పోలీసులు భావించి అప్రమత్తమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం