Revanth Reddy: నిఖత్‌ జరీన్‌కు రూ.5లక్షల నజరానా ప్రకటించిన రేవంత్‌రెడ్డి

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన నిఖత్‌ జరీన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభినందించి రూ.5లక్షల నజరానా ప్రకటించారు.

Published : 22 May 2022 19:32 IST

హైదరాబాద్‌: ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన నిఖత్‌ జరీన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభినందించి రూ.5లక్షల నజరానా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. నిజామాబాద్ నుంచి ఇస్తాంబుల్ వరకు జరీన్‌ ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తోందని కొనియాడారు. గతంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, సానియా మీర్జాలకు ఇచ్చినట్లు నిఖత్‌ జరీన్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్‌ పారితోషికం ఇచ్చి ఆదరించాలని రేవంత్ రెడ్డి కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని