
Revanth Reddy: తెలంగాణలో పాదయాత్ర చేయాలని రాహుల్ను కోరదాం: రేవంత్రెడ్డి
ఈ ఒక్క ఏడాది కష్టపడితే కాంగ్రెస్దే అధికారం
కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశంలో టీపీసీసీ చీఫ్
హైదరాబాద్: రైతు సంఘర్షణ సభ, వరంగల్ డిక్లరేషన్కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. అందరి కృషితోనే సభ విజయవంతమైందని చెప్పారు. గాంధీభవన్లో నిర్వహించిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయ్పూర్లో జరిగిన చింతన్ శిబిర్లో తీసుకున్న అన్ని అంశాలను ఈ సమావేశంలో ఆమోదిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశామని.. దీన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపాలని నిర్ణయించామన్నారు.
మే 21 నుంచి నెలరోజుల పాటు ‘రైతు రచ్చబండ’
సభ్యత్వ నమోదును విజయవంతంగా పూర్తిచేశామని.. కాంగ్రెస్ సభ్యులకు ప్రమాద బీమా చేయించామని రేవంత్ చెప్పారు. ఎవరికైనా ప్రమాదం జరిగితే వెంటనే గాంధీభవన్లోని కార్యాలయంలో తెలపాలని సూచించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ను జనంలోకి తీసుకెళ్లాలన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మే 21 నుంచి నెలరోజులపాటు రైతు రచ్చబండ కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. రైతు రచ్చబండ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో రైతులతో చర్చించాలని.. 30 రోజుల పాటు దీన్ని నిర్వహించాలని సూచించారు. ముఖ్యనేతలంతా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తాను వరంగల్ జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామంలో రచ్చబండ సభలో పాల్గొంటానని రేవంత్ చెప్పారు.
అక్టోబర్ 2 నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరగనుందన్నారు. రాహుల్ గాంధీ పాల్గొనే పాదయాత్ర మొదట తెలంగాణలో చేపట్టాలని ఆయన్ను కోరదామని చెప్పారు. రాష్ట్రంలో 100 కి.మీ. ఆయన పాల్గొనేలా చూద్దామని రేవంత్ అన్నారు. డిజిటల్ మెంబర్షిప్, వరంగల్ డిక్లరేషన్కు తెలంగాణ మోడల్ అని పేరొచ్చిందని.. రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా రాష్ట్రంలో చేపట్టి హ్యాట్రిక్ కొడదామన్నారు. అందరి కష్టంతో ఇవన్నీ సాధించామని.. ఈ ఒక్క ఏడాది కష్టపడితే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుందని రేవంత్ దిశానిర్దేశం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Vedantu: ఇక ఆఫ్లైన్లోనూ పాఠాలు.. తొలి కేంద్రాన్ని ప్రారంభించిన ‘వేదాంతు’
-
Politics News
Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా శిందే, డిప్యూటీ సీఎంగా ఫడణవీస్ ప్రమాణ స్వీకారం
-
Politics News
Telangana News: తెలంగాణలో భాజపాకు బిగ్ షాక్... తెరాసలో చేరిన కార్పొరేటర్లు
-
Sports News
Ind vs Eng: టీమ్ఇండియా కెప్టెన్గా బుమ్రా... తుదిజట్టు ప్రకటించిన ఇంగ్లాండ్
-
Movies News
Social Look: రెజీనా ‘లైఫ్’ క్యాప్షన్.. కట్టిపడేసేలా జాక్వెలిన్ ‘రెడ్’లుక్!
-
Business News
Credit card rules: క్రెడిట్ కార్డుదారులూ అలర్ట్!.. జులై 1 నుంచి కొత్త రూల్స్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- IND vs ENG: కథ మారింది..!
- Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ శిందే.. నేడే ప్రమాణం
- Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Major: ఓటీటీలోకి ‘మేజర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?