Revanth Reddy: 22 ఏళ్లకే ఇంటికి పంపిస్తే తర్వాత వారి పరిస్థితేంటి?: రేవంత్రెడ్డి
సికింద్రాబాద్ విధ్వంసం ఘటనలో నిందితులుగా ఉన్న నిరసనకారులతో కాంగ్రెస్ నేతలు ములాఖత్ అయ్యారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ విధ్వంసం ఘటనలో నిందితులుగా ఉన్న నిరసనకారులతో కాంగ్రెస్ నేతలు ములాఖత్ అయ్యారు. చంచల్గూడ జైలులో ఉన్న నిరసనకారులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, నేతలు మల్లు రవి, అంజన్కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు కలిశారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. సమాజంలో ఏ వర్గంతోనూ చర్చించకుండా అగ్నిపథ్పై నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. యువత విషయంలో కీలకమైన ఈ నిర్ణయం తీసుకునే అంశంలో ప్రధాని మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.
‘‘దేశాన్ని రక్షిస్తున్న సైనికులను గత ప్రభుత్వాలు కీలకంగా భావించాయి. దేశభక్తి కలిగిన వేలమంది యువకులను సైన్యంలోకి తీసుకున్నారు. సైనికులకు ప్రత్యేకమైన గౌరవం దక్కేలా చట్టాల చేశాయి. కేవలం నాలుగేళ్ల కోసం యువకులను సైన్యంలోకి తీసుకోవడం సరికాదు. నాలుగేళ్లు పని చేయించుకుని 22 ఏళ్లకే ఇంటికి పంపిస్తే తర్వాత వారి పరిస్థితేంటి?మోదీ సర్కారు జవాన్లలో గందరగోళం సృష్టించింది’’ అని రేవంత్ ఆరోపించారు.
భవిష్యత్కు భద్రత లేకుండా అగ్నిపథ్ తీసుకొచ్చారు..
‘‘పార్లమెంట్లో చర్చించిన తర్వాత అగ్నిపథ్పై నిర్ణయం తీసుకుని ఉంటే ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి కాదు. సైన్యంలో పదవీ విరమణ తర్వాత ఉద్యోగ భద్రత ఉంటుంది. నాలుగు సంవత్సరాల కోసం రిక్రూట్ చేసే విధనంపై హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు. దేశ భద్రతకు ముప్పు వస్తుందనే యువత ఆందోళనలు చేస్తోంది. అడ్డమీది కూలీల మాదిరిగా సైన్యం కాకూడదు. భవిష్యత్కు భద్రత లేకుండా అగ్నిపథ్ తీసుకొచ్చారు. రెండేళ్ల శిక్షణలో నేర్చుకోవాల్సింది కేవలం 6 నెలల్లో నేర్పించడం సాధ్యమేనా?అలా చేసే వారు సమర్థులైన ఆర్మీ అధికారులు అవుతారా? దేశ భద్రత దృష్ట్యా అగ్నిపథ్ను వెంటనే ఉపసంహరించుకోవాలి’’ అని రేవంత్ డిమాండ్ చేశారు.
దేశ యువతకు మోదీ ఇచ్చే నజరానా ఇదేనా?
‘‘రిమాండ్లో ఉన్న యువకులకు సంబంధించి చాలా మంది తల్లిదండ్రులకు వారి పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియదు. సికింద్రాబాద్ అల్లర్ల కేసులో వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. భవిష్యత్లో ఉద్యోగాలు రాకుండా వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. మేం ఎలాంటి విధ్వంసాలకు పాల్పడలేదని రిమాండ్లో ఉన్న ఆర్మీ అభ్యర్థులు చెప్తున్నారు. ఇంతమందిపై ఇంత గుడ్డిగా 307 ఐపీసీ కేసు ఎలా పెడతారు? దేశ యువతకు మోదీ ఇచ్చే నజరానా ఇదేనా? అగ్నిపథ్ను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. రైల్వే పోలీసులు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి 40రోజుల్లో కేసు దర్యాప్తును ముగించాలి. పార్లమెంట్ సమావేశాల్లో అగ్నిపథ్పై ప్రస్తావిస్తాం.
ఈనెల 27న అగ్నిపథ్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తాం’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
మహారాష్ట్రలోని బారామతిలో ఉత్కంఠ పోరు నెలకొంది. పవార్ కుటుంబంలోని ఇద్దరు మహిళలు పరస్పరం తలపడటం ఉత్కంఠ రేపుతోంది. -
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్డీఏ కూటమి నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. -
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
తెలుగుదేశం అభ్యర్థులకు అధినేత చంద్రబాబు ఈనెల 21న బీఫామ్లు అందజేయనున్నారు. -
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. -
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
భీమిలి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. -
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
వైఎస్ఆర్ హయంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తి చేసి -
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
మాజీ మంత్రి వివేకానందరెడ్డి 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. -
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీకి చెందిన గూండాలు అరాచకం సృష్టించారు. -
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
కాంగ్రెస్కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో భాజపా (BJP) విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. -
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. -
వాల్తేరు క్లబ్లో వైకాపా డిష్యుం డిష్యుం!
వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి. ఈ రోజుకూ నేను అదే చెబుతున్నా. ఏ రోజైనా ఒక సామాజికవర్గం చేతిలో ఉండి ఉండొచ్చు. -
నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections) నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. -
చీకటి పాలనకు చిరునామా.. జగనన్న కాలనీలు!
ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తాం.. అంటూ జగనన్న కాలనీల విషయంలో సీఎం జగన్ మొదటి నుంచీ గొప్పలు చెబుతున్నారు. -
వ్యూహకర్తలదే పెత్తనం!.. ప్రచారంలో పార్టీలను శాసించేది వారే
భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్