Telangana News: తెరాస, భాజపాలకు రాజకీయ సమాధి కట్టేది రైతులే: రేవంత్రెడ్డి
రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల్సిన ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మండిపడ్డారు. తెరాస, భాజపా దీక్షలపై ట్విటర్ వేదికగా రేవంత్
హైదరాబాద్: రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెరాస, భాజపా దీక్షలపై ట్విటర్ వేదికగా రేవంత్ విమర్శలు గుప్పించారు. కష్టం చేసిన రైతులు.. దళారుల చేతుల్లో దగాపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీలో తెరాస, గల్లీలో భాజపా.. దీక్షల పేరుతో డ్రామాలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ రెండు పార్టీలకు అన్నదాతలే రాజకీయ సమాధి కడతారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న దోపిడీని గ్రామాల్లో సభలు పెట్టి బయటపెట్టామని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు. రేపటి నుంచి ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని రేవంత్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు