Telangana News: తెరాస, భాజపాలకు రాజకీయ సమాధి కట్టేది రైతులే: రేవంత్‌రెడ్డి

రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల్సిన ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెరాస, భాజపా దీక్షలపై ట్విటర్‌ వేదికగా రేవంత్‌

Published : 11 Apr 2022 15:58 IST

హైదరాబాద్‌: రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. తెరాస, భాజపా దీక్షలపై ట్విటర్‌ వేదికగా రేవంత్‌ విమర్శలు గుప్పించారు. కష్టం చేసిన రైతులు.. దళారుల చేతుల్లో దగాపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీలో తెరాస, గల్లీలో భాజపా.. దీక్షల పేరుతో డ్రామాలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ రెండు పార్టీలకు అన్నదాతలే రాజకీయ సమాధి కడతారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న దోపిడీని గ్రామాల్లో సభలు పెట్టి బయటపెట్టామని ఈ సందర్భంగా రేవంత్‌ గుర్తు చేశారు. రేపటి నుంచి ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్‌ ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని రేవంత్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని