Revanth Reddy: మా వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరం లేదు: రేవంత్‌రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. వెంకట్‌రెడ్డికి, తనకు మధ్య ఉద్దేశపూర్వకంగానే కొందరు అగాథం..

Published : 05 Aug 2022 14:35 IST

దిల్లీ: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. వెంకట్‌రెడ్డికి, తనకు మధ్య ఉద్దేశపూర్వకంగానే కొందరు అగాథం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ద్రోహం చేసిన రాజగోపాల్‌రెడ్డి.. పార్టీ కోసమే పని చేసే వెంకటరెడ్డి.. ఇద్దరూ వేరు అని అన్నారు. అపోహలతో మా వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరం లేదంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డి చేపట్టిన కాంట్రాక్టులు, ఎనిమిదేళ్లలో ఆయన కేసీఆర్‌పై చేసిన పోరాటాల గురించి చండూరు సభలో మాట్లాడతానని రేవంత్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని