కేసీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ
రైతులు పండించిన శనగలకు మద్దతు ధర కల్పించడం సహా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి..
హైదరాబాద్: రైతులు పండించిన శనగలకు మద్దతు ధర కల్పించడం సహా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఉదాసీనత కారణంగానే రాష్ట్రంలో శనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. వ్యాపారులు, దళారులపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మార్కెట్లు పూర్తిగా దళారుల చేతుల్లోకి వెళ్లిపోయాయన్నారు. శనగకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5,100 మద్దతు ధరతో రైతులకు గిట్టుబాటు కావడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ జోక్యం లేకపోవడం వల్ల మద్దతు ధర రాకపోగా క్వింటాలుకు రూ. 700 నుంచి రూ.1000 వరకు తక్కువ చేస్తూ అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 3.43 లక్షల ఎకరాల్లో శనగ పంట వేశారని రేవంత్ వివరించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు పంటను తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. మరో 20 రోజుల్లో యాసంగి వరి పంట రాబోతుందని ప్రభుత్వ ప్రకటనలు, చర్యలతో శనగ రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారన్నారు. శనగల కొనుగోలుకు తక్షణమే మార్క్ఫెడ్కు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వా్నికి విజ్ఞప్తి చేశారు. కనీస మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు 60 లక్షల ఎకరాల్లో వేసిన వరి పంట మరో 20 రోజుల్లో రానున్నందున తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్