సంజీవరెడ్డిని కలిసిన రేవంత్‌రెడ్డి

ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డిని హైదరాబాద్‌ బర్కత్‌పురాలోని ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా

Updated : 18 Jul 2021 04:15 IST

హైదరాబాద్‌: ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డిని హైదరాబాద్‌ బర్కత్‌పురాలోని ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రేవంత్‌ రెడ్డి నియామకంతో పార్టీకార్యకర్తల్లో ఉత్సాహం వచ్చిందన్నారు. అందరినీ కలుపుకొని పోతూ పనిచేయాలన్నారు. బలమైన కార్మికసంఘం ఐఎన్టీయూసీ .. కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేసేలా చూడాలని రేవంత్‌రెడ్డి కోరారని, పార్టీ బలోపేతం కోసం కార్మికులు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి మరోసారి కూలంకషంగా చర్చించేందుకు రేవంత్‌రెడ్డి మరోసారి వస్తానని చెప్పారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కలిసి పనిచేస్తామని సంజీవరెడ్డి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని