Telangana News: నాటకాలాడితే.. రైతులు మీ రెండు పార్టీల మోసాలను గ్రహించలేరా?: రేవంత్రెడ్డి
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్తో తెరాస ప్రభుత్వం సోమవారం దిల్లీలో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. మరోవైపు..
హైదరాబాద్: తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్తో తెరాస ప్రభుత్వం సోమవారం దిల్లీలో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. మరోవైపు.. ధాన్యాన్ని కొనాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మండిపడ్డారు. యాసంగి సీజన్లో ముందస్తుగా చేతికి వచ్చే ధాన్యం రా రైస్ కిందికే వస్తుందని.. అలా వచ్చే ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై సీఎం కేసీఆర్కు పది ప్రశ్నలతో కూడిన ఓ లేఖ రేవంత్ రెడ్డి విడుదల చేశారు.
తెలంగాణ నుంచి ఇక బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 అక్టోబరు 4న కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు ఉరితాళ్లు బిగిస్తూ కేంద్రానికి లేఖ రాసే అధికారం మీకు ఎవరిచ్చారు? అని మండిపడ్డారు. ఇప్పుడు ధర్నాలు, నిరసనలు అంటూ నాటకాలు ఆడితే రైతులు మీ రెండు పార్టీల మోసాలను గ్రహించలేరా అని ప్రశ్నించారు. ‘‘ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస చిత్తశుద్ధిపై రైతులకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్ల కారణంగా రూ.7500 కోట్లు నష్టం వచ్చినట్లు చెప్పి.. ఇకపై కొనుగోలు కేంద్రాలు ఉండవని గత ఏడాది ఫిబ్రవరిలో ప్రకటన చేయలేదా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాల కారణంగా ఇప్పటికీ రైతులు దళారుల చేతుల్లో నష్టపోతున్న విషయం నిజం కాదా? ప్రభుత్వం చేతులెత్తేయడంతో నిస్సహాయ స్థితిలో రైతులు తక్కువ ధరకే ధాన్యాన్ని మిల్లర్లకు అమ్ముకుంటున్నారు’’ అని ప్రశ్నలు సంధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ