Revanth Reddy: డ్రగ్స్ కేసులో ఎవరిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: రేవంత్రెడ్డి
మాదక ద్రవ్యాల కేసు విచారణ వివరాలను ఈడీకి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఈడీ జాయింట్ డైరెక్టర్ను
హైదరాబాద్: మాదకద్రవ్యాల కేసు విచారణ వివరాలను ఈడీకి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఈడీ జాయింట్ డైరెక్టర్ను కలిసిన రేవంత్... హైకోర్టు తీర్పు కాపీ, వినతి పత్రం ఆయనకు అందజేశారు. డ్రగ్స్ కేసు విచారణను ఈడీకి ఇవ్వాలని గతంలో రేవంత్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
‘‘రాష్ట్రంలో గుట్కా లేదు, మట్కా లేదు, గుడుంబా లేదు, పేకాట లేదు.. అని ఎన్నో సార్లు సీఎం కేసీఆర్ చెప్పారు. 2017 నుంచి విచారణ అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నా. డ్రగ్స్ మహమ్మారి విద్యాసంస్థల్లోకి చేరింది. డ్రగ్స్ గురించి నేను మాట్లాడితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుందని కేటీఆర్, బాల్క సుమన్ లాంటి వాళ్లు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికారు. సింగరేణి కాలనీలో జరిగిన బాలికపై అత్యాచారం గంజాయి మత్తులో చేసింది కాదా? దూల్పేట గుడుంబా స్థావరాలపై దాడులు చేశారు కానీ, వారికి ప్రత్యామ్నాయం కల్పించలేదు.. అందుకే వాళ్లు గంజాయి అమ్ముతున్నారు, వాడుతున్నారు. స్కూల్స్ నుంచి కాలేజీల వరకు విచ్చలవిడిగా డ్రగ్స్ లభిస్తున్నాయి. జూబ్లీహిల్స్ పరిధిలో కాంగ్రెస్ హయాంలో 4 పబ్లు ఉంటే ఇవాళ 90 పబ్లు ఉన్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది. 2017లో డ్రగ్స్ విచారణ ఏమయింది... ఎందుకు అటకెక్కింది? అకున్ సబర్వాల్ను అర్ధాంతరంగా ఎందుకు బదిలీ చేశారు? అప్పుడు 12 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.. ఏమయ్యాయి? ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేశా.. అయినా ముందుకురాలేదు. దీనిపై హైకోర్టుకు కూడా వెళ్లా.. తెలంగాణ యువత, ప్రజలను డ్రగ్స్ నుంచి కాపాడుకోవాలి. నైజీరియా నుంచి వచ్చిన వాళ్లు రాజ్యం ఏలుతున్నారు. ఈడీ అధికారులు విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వారి విచారణను వ్యతిరేకిస్తోందని ఈడీ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం సహకరించట్లేదని ఈడీ స్పష్టంగా చెప్పింది. ఎక్సైజ్ శాఖ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.. కానీ, ఈడీకి ఇవ్వట్లేదు. డ్రగ్స్ సరఫరా చేసేవాళ్లు, వాడిన వాళ్లు, అమ్మే వాళ్లు.. ఇలా 3 రకాల నేరస్థులు ఉన్నారు. గుజరాత్, ముంబై పోర్టుల్లో 100 క్వింటాళ్ల డ్రగ్స్ పట్టుబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో స్వతంత్రంగా విచారణ చేయాలని కోరుతున్నా. మీరు సేకరించిన అన్ని ఆధారాలు, సాక్ష్యాలు వెంటనే ఈడీకి అందజేసి కోర్టు ఆదేశాలు పాటించండి. డ్రగ్స్ వాడే వాళ్లు ఎంత పెద్దవాళ్లయినా సరే చర్యలు తీసుకోండి. సినీ పరిశ్రమ ప్రముఖులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా... డ్రగ్స్ వాడకుండా చూడండి. 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. రాసిపెట్టుకోండి. అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ దొంగల అంతు చూస్తాం’’ అని రేవంత్రెడ్డి హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్