- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
UP Polls 2022: ప్రధాని మోదీ సభ రద్దుపై జయంత్ చౌధురి వ్యంగ్యాస్త్రాలు!
నోయిడా: యూపీలో ఎన్నికల గడువు సమీపిస్తున్నవేళ రాజకీయ రణక్షేత్రంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భాజపా, సమాజ్వాదీ పార్టీ- ఆర్ఎల్డీ కూటమిల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు కొనసాగుతోంది. దీంతో ఇరు పక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. తాజాగా సమాజ్వాదీ పార్టీ మిత్రపక్షమైన ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌధురి ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పశ్చిమ యూపీలోని బిజ్నోర్లో వర్ధమాన్ కళాశాల మైదానంలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార సభ జరగాల్సి ఉంది. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా రద్దు చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత మోదీ వర్చువల్గా పాల్గొని సభలో ప్రసంగించారు.
ఈ పరిణామంపై జయంత్ ట్విటర్ వేదికగా స్పందించారు. బిజ్నోర్లో సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు.. కానీ ‘భాజపాకు ప్రతికూల వాతావరణం’ అంటూ వ్యంగ్య బాణాలు వదిలారు. అంతేకాకుండా ప్రతికూల వాతావరణం ఉండటంతో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనాల్సిన భౌతిక ర్యాలీ రద్దయినట్టు టీవీలో వచ్చిన స్క్రీన్షాట్ను షేర్ చేశారు. అలాగే, ఈరోజు బిజ్నోర్లో సూర్యుడు మండుతున్నట్టుగా వాతావరణం పొడిగా ఉన్నట్టు ఉన్న గూగుల్ వెదర్ రిపోర్టును సైతం తన ట్వీట్కు జత చేశారు. యూపీలో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగనుండగా.. ఉత్తరాఖండ్ సరిహద్దుకు సమీపంలో ఉండే ఈ బిజ్నోర్ ప్రాంతంలో ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
T20 Cricket : టీ20ల్లో టాప్ స్కోరర్.. మళ్లీ రోహిత్ను అధిగమించిన కివీస్ ఓపెనర్
-
India News
Mukesh Ambani: ముకేశ్ అంబానీకి బెదిరింపులు.. రెండు గంటల్లో 8ఫోన్ కాల్స్!
-
Crime News
Crime News: బీదర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు హైదరాబాద్ వాసులు మృతి
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Viral-videos News
Viral video: భారత జాతీయ గీతం ‘జనగణమన’ వినిపించిన పాకిస్థానీ మ్యుజీషియన్
-
Crime News
Guntur: ప్రత్తిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
- Flight: గర్ల్ఫ్రెండ్తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Indraja: నాకు అమ్మాయి పుట్టేదాకా.. పెళ్లి విషయం ఎవరికీ తెలియదు: ఇంద్రజ
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Tirumala: 50మంది అనుచరులకు శ్రీవారి బ్రేక్ దర్శనం.. ఏపీ మంత్రిపై విమర్శలు
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్ఛైర్లో ఝున్ఝున్వాలా డ్యాన్స్
- Ukraine Crisis: ఉక్రెయిన్లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు