ఔరంగాబాద్ శంభాజీనగరే: సంజయ్రౌత్
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరం పేరును శంభాజీనగర్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ‘మహా వికాస్ అఘాడీ’ కూటమిలో మరోసారి విభేదాలు తలెత్తాయి. శివసేన తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఎన్సీపీ దీనికి మద్దతు
ముంబయి: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరం పేరును శంభాజీనగర్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ‘మహా వికాస్ అఘాడీ’ కూటమిలో మరోసారి విభేదాలు తలెత్తాయి. శివసేన తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఎన్సీపీ అటు మద్దతు ఇవ్వట్లేదు.. ఇటు వ్యతిరేకించట్లేదు. ఈ నేపథ్యంలో మిత్రపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఔరంగాబాద్ పేరుమార్పును ఎందుకు వ్యతిరేకిస్తుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను మీడియా ప్రశ్నించగా.. తనకు తెలియదంటూనే.. పేరుమార్పు కచ్చితంగా జరుగుతుందని తేల్చిచెప్పారు. ‘‘కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తుందో నాకు తెలియదు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. దీనిపై పార్టీ చర్చకు రావొచ్చు. కానీ, పేరు మార్పు నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. ఈ విషయంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పష్టత ఇచ్చారు. ఔరంగాబాద్ మా వరకు శంభాజీనగరే’’అని తెలిపారు.
మరోవైపు ఔరంగాబాద్ పేరు మార్పు విషయంలో కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటేలా శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ సంపాదకీయం ప్రచురించింది. ‘భారతదేశ రాజ్యాంగం లౌకికవాదంతో కూడుకున్నది. ఔరంగజేబు మతాలను ద్వేషించాడు. సిక్కులను, హిందువులను చిత్రహింసలు పెట్టాడు. అలాంటి వ్యక్తి జ్ఞాపకాలపై ఎందుకు దృష్టి పెట్టాలి? అసలు ఎవరీ ఔరంగజేబు?నిజమైన మరాఠాలకు, హిందువులకు ఔరంగజేబుతో ఎలాంటి అనుబంధం లేదు. ఔరంగాబాద్ పేరు మార్చడం వల్ల లౌకిక పార్టీల ఓటు బ్యాంక్పై ప్రభావం పడుతుందని, ముస్లిం సామాజిక వర్గం అసంతృప్తి చెందుతుందనే ఆందోళన చెందుతున్నారు’’అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ రాసుకొచ్చింది.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!