కాంగ్రెస్ ప్రజలను తప్పు దోవ పట్టించింది: నడ్డా
కొవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్ తమ రాజకీయాలతో దేశాన్ని బలహీన పరచవద్దని విజ్ఞప్తి చేస్తూ బీజేపీ చీఫ్ నడ్డా మంగళవారం సోనియా గాంధీకి లేఖ రాశారు
దిల్లీ: కొవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్ తమ రాజకీయాలతో దేశాన్ని బలహీన పరచవద్దని విజ్ఞప్తి చేస్తూ భాజపా చీఫ్ నడ్డా మంగళవారం కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థతుల్లో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, భయాందోళలను కలిగిస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీతో సహా పార్టీ నాయకుల ప్రవర్తనను తప్పుబట్టారు. కాంగ్రెస్ నాయకులు సెంటర్ ఫర్ కొవిడ్ మేనేజ్మెంట్ పై నిరంతరం విమర్శలు చేయడం తననను బాధపెట్టిందని తెలిపారు.
కొవిడ్కు వ్యతిరేక పోరాటంలో భారత ప్రభుత్వం నిమగ్నమై ఉందని అన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత ఏడాదిగా కరోనా మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని అణగదొక్కే లక్ష్యంతో కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారని నడ్డా ఆరోపించారు.
భారత్లో తయారైన వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రచారం చేసిందన్నారు. టీకా కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. బీజేపీ, ఎన్డిఏ ప్రభుత్వాలు టీకాలను ఉచితంగా ఇస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వమున్న రాష్ట్రాల్లో టీకా ఎందుకు ఉచితంగా అందించడం లేదని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ మొదట లాక్డౌన్ వ్యతిరేకించి, తర్వాత లాక్డౌన్ పెట్టమని డిమాండ్ చేయడం, సూపర్ స్ప్రెడర్ కార్యక్రమాలకు హాజరు కావడం, ఇతర ప్రాంతాల్లో జరిగిన ర్యాలీలను నిందించడం వంటి చర్యలు నీచంగానూ, చిన్నతనంగానూ ఉన్నాయని నడ్డా మండిపడ్డారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో విషయంలో కాంగ్రెస్ చేస్తున్న హంగామాను ప్రస్తావిస్తూ.. 2012లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కొత్త శాసనసభా భవనం నిర్మాణానికి సంబధించిన పనులు జరుగుతున్నాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా