Andhra News: ఏపీ రాజకీయ చిత్రపటంపై వైకాపా ప్లీనరీ తనదైన ముద్ర వేస్తుంది: విజయసాయి
వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో వైకాపా విజయం సాధిస్తుందని.. అందుకు అవసరమైన కార్యాచరణపై ప్లీనరీలో చర్చిస్తామని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి
గుంటూరు: వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో వైకాపా విజయం సాధిస్తుందని.. అందుకు అవసరమైన కార్యాచరణపై ప్లీనరీలో చర్చిస్తామని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లాలో పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి విజయసాయి పరిశీలించారు.
ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం విజయసాయి మాట్లాడుతూ.. ‘‘జులై 8, 9 తేదీల్లో ఘనంగా ప్లీనరీ నిర్వహిస్తున్నాం. ఇతర పార్టీల కంటే భిన్నంగా ఏర్పాట్లు చేస్తున్నాం. గత ప్లీనరీలో నవరత్నాలను ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చాం. ఈసారి మరిన్ని మెరుగైన కార్యక్రమాలను చేపట్టి తిరిగి అధికారంలోకి వస్తాం. ప్లీనరీకి వచ్చే నాయకులను స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానిస్తారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు హోదాలో విజయమ్మ ప్లీనరీలో పాల్గొంటారు. ఏపీ రాజకీయ చిత్రపటంపై వైకాపా ప్లీనరీ తనదైన ముద్ర వేస్తుంది. భవిష్యత్ కార్యాచరణపై సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. పాలనలో సామాజిక విప్లవం తీసుకొచ్చిన ఏకైక నాయకుడిగా జగన్ చిరస్థాయిగా నిలుస్తారు’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత