Andhra News: ఏపీ రాజకీయ చిత్రపటంపై వైకాపా ప్లీనరీ తనదైన ముద్ర వేస్తుంది: విజయసాయి

వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో వైకాపా విజయం సాధిస్తుందని.. అందుకు అవసరమైన కార్యాచరణపై ప్లీనరీలో చర్చిస్తామని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి

Published : 29 Jun 2022 12:40 IST

గుంటూరు: వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో వైకాపా విజయం సాధిస్తుందని.. అందుకు అవసరమైన కార్యాచరణపై ప్లీనరీలో చర్చిస్తామని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లాలో పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి విజయసాయి పరిశీలించారు.

ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం విజయసాయి మాట్లాడుతూ.. ‘‘జులై 8, 9 తేదీల్లో ఘనంగా ప్లీనరీ నిర్వహిస్తున్నాం. ఇతర పార్టీల కంటే భిన్నంగా ఏర్పాట్లు చేస్తున్నాం. గత ప్లీనరీలో నవరత్నాలను ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చాం. ఈసారి మరిన్ని మెరుగైన కార్యక్రమాలను చేపట్టి తిరిగి అధికారంలోకి వస్తాం. ప్లీనరీకి వచ్చే నాయకులను స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానిస్తారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు హోదాలో విజయమ్మ ప్లీనరీలో పాల్గొంటారు. ఏపీ రాజకీయ చిత్రపటంపై వైకాపా ప్లీనరీ తనదైన ముద్ర వేస్తుంది. భవిష్యత్ కార్యాచరణపై సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. పాలనలో సామాజిక విప్లవం తీసుకొచ్చిన ఏకైక నాయకుడిగా జగన్ చిరస్థాయిగా నిలుస్తారు’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని