Sajjala: సీబీఐ జగన్ పేరు ప్రస్తావించడం చిల్లర చేష్ట: సజ్జల
వివేకా హత్యకేసులో సీబీఐ.. జగన్ పేరు ప్రస్తావించడం దారుణమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీబీఐవి చిల్లర చేష్టలంటూ అసహనం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: వివేకా హత్యకేసులో సీబీఐ.. సీఎం జగన్ పేరు ప్రస్తావించడం దారుణమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీబీఐవి చిల్లర చేష్టలంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో సడన్గా సీబీఐ సీఎం జగన్ పేరు ప్రస్తావించడం చిల్లర చేష్టగా అనిపిస్తోంది. సంచలనం చేయడానికి చేసిన ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది. సీబీఐ లాంటి సంస్థ ఎందుకు సంచలనం చేయాలనుకుంటుందో వివరణ ఇవ్వాలి. దీని వెనుక ఉన్న కుట్రకోణంపై విచారణ చేయాలి. అవినాష్రెడ్డిని ఎలాగైనా అరెస్టు చేయాలని టార్గెట్గా పెట్టుకుని విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు’’ అని సజ్జల ఆరోపించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి అనుబంధ కౌంటర్లో సీబీఐ కీలక విషయం ప్రస్తావించింది. వివేకా మృతి విషయం జగన్కు ఉదయం 6.15 గంటలకు ముందే తెలిసినట్టు దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొంది. ‘‘వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే వివేకా మృతి విషయం జగన్కు తెలుసు. జగన్కు అవినాష్రెడ్డే చెప్పారా? అనేది దర్యాప్తు చేయాల్సి ఉంది. విచారణకు అవినాష్రెడ్డి సహకరించడం లేదు. హత్య వెనుక భారీ కుట్రను చెప్పేందుకు అవినాష్రెడ్డి ముందుకు రావడం లేదు. హత్య జరిగిన రోజు రాత్రి 12.27 నుంచి 1.10 వరకు అవినాష్ వాట్సప్ కాల్స్ మాట్లాడారు’’ అని సీబీఐ అనుబంధ కౌంటర్లో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్