AP Cabinet: సామాజిక సమతుల్యతతో కొత్త మంత్రివర్గం: సజ్జల రామకృష్ణారెడ్డి

మంత్రివర్గ కూర్పుపై ఏపీ సీఎం జగన్‌ కసరత్తు పూర్తయింది. మంత్రివర్గ జాబితాలో సీఎం మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది.

Updated : 10 Apr 2022 15:41 IST

అమరావతి: మంత్రివర్గ కూర్పుపై ఏపీ సీఎం జగన్‌ కసరత్తు పూర్తయింది. మంత్రివర్గ జాబితాలో సీఎం మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పలు దఫాలుగా చర్చించిన సీఎం.. ఈరోజు కూడా సమావేశమయ్యారు. సీఎంతో భేటీ అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ కేబినెట్‌ కూర్పుపై సీఎం కసరత్తు ముగిసినట్లు చెప్పారు. సామాజిక సమతుల్యత ఉండేలా నూతన మంత్రివర్గ కూర్పు ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతాల మేరకు కొత్త మంత్రివర్గం ఉంటుందని చెప్పారు. 

సీఎం జగన్‌ ఖరారు చేసిన కొత్త మంత్రుల జాబితాను సాయంత్రం 6 గంటల తర్వాత గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు పంపనున్నట్లు సజ్జల తెలిపారు. ఆ జాబితాను సీల్డ్‌ కవర్‌లో అందజేస్తారన్నారు. తుదిజాబితాలో ఉన్న ఎమ్మెల్యేలకు సీఎం జగనే స్వయంగా ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వనున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని