Andhra News: తెదేపాతో పొత్తుపై జవాబు చెప్పలేని స్థితిలో పవన్: సజ్జల
పొత్తులపై జనసేన, తెదేపా నేతల ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెబుతూనే
అమరావతి: పొత్తులపై జనసేన, తెదేపా నేతల ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెబుతూనే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా అంటే జవాబు చెప్పలేని స్థితిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు కూడా త్యాగాలకు సిద్ధం అంటూనే కూటమిని నడిపిస్తామని చెప్పడమేంటని నిలదీశారు. జనసేన ప్రకటనపై భాజపా స్పందన మరో రకంగా ఉందన్నారు. ఎలాంటి భావసారూప్యత లేని ఈ పార్టీలు ఎలా కలుస్తాయని సజ్జల ప్రశ్నించారు. ఏదో విధంగా సీఎం జగన్ను గద్దె దింపి, చంద్రబాబుకు అధికారం కట్టబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేస్తున్నారని సజ్జల విమర్శించారు.
‘‘వైకాపా వ్యతిరేక ఓటును చీలనివ్వమని చెబుతూనే పొత్తులపై మాట్లాడుతున్నారు. జనసేన పార్టీకి ఓ విధానమంటూ లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని గత ఎన్నికల ముందు ఆరోపించిన పవన్.. ఓట్లు పక్కకు పోకుండా డమ్మీలను పెట్టి తెదేపాకు సహకరించారు. జనసేన, తెదేపా.. రెండూ ఒక్కటే. చంద్రబాబు స్క్రీన్ ప్లే, డైరెక్షన్లోనే పవన్ నడుస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా పొత్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. పగటి కలలు కంటున్నారు. బరితెగింపు, ప్రజలంటే లెక్కలేని తనంతో వీరంతా వ్యవహరిస్తున్నారు. పొత్తులపై అందరూ కలసి జనాలను ఫూల్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ జాతీయ స్థాయి పార్టీ కాబట్టే గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. ఆయనకు ఇష్టం లేకపోయినా అధిష్ఠానం ఒత్తిడి మేరకు అప్పట్లో పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రజల మద్దతుతో సీఎం జగన్ ఒంటరిగానే పోటీ చేస్తారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఈ నెల 11వ తేదీ నుంచి గడప గడపకు వైకాపా కార్యక్రమాన్ని చేపడుతున్నాం’’ అని సజ్జల పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్