ఒక్క నీటి చుక్కనూ వదులుకోం: సజ్జల

జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

Updated : 04 Jul 2021 13:49 IST

అమరావతి: జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తామని తెలిపారు. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం అని స్పష్టం చేశారు. జల వివాదంపై ఇప్పటికే అందరికీ లేఖలు రాశామని చెప్పారు. కేంద్రం కూడా మధ్యవర్తిత్వం వహిస్తోందన్నారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాం అని వివరించారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామన్నారు.

రెచ్చగొడితే రెచ్చిపోమని సందర్భోచితంగా స్పందిస్తామని సజ్జల తెలిపారు. కృష్ణా బేసిన్‌లో విద్యుత్‌ ఉత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం ఆపాలని ఏపీ, పోతిరెడ్డిపాడు వద్ద ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించొద్దని తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు