Andhra News: బీసీలంతా వైకాపా వెంటే ఉన్నారు: సజ్జల
బీసీలంతా వైకాపా వెంటే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...
తాడేపల్లి: బీసీలంతా వైకాపా వెంటే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొత్త కేబినెట్ కూర్పులో సామాజిక సమీకరణలపై వివరించారు. తమ కేబినెట్లో దాదాపు 70శాతం మంది బీసీలు ఉన్నారని వెల్లడించారు.
‘‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు 17 మంత్రి పదవులు దక్కాయి. మా మంత్రివర్గ జాబితాను చంద్రబాబు పరిశీలించాలి. తెదేపా ప్రభుత్వంలో 25 మంది మంత్రుల్లో 55శాతం ఓసీలు ఉన్నారు. కానీ, జగన్ కేబినెట్లో 68 శాతం వెనుకబడిన వర్గాల వారే ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు ఎస్టీలు, మైనార్టీలకు కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు. వైకాపా ఎప్పుడూ రాజకీయ సాధికారత దిశగా అడుగులు వేస్తుంది. ట్రస్టులు, నామినేటెడ్, ఇతర సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశాం’’ అని సజ్జల వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!