Akhilesh: ప్రజలు మేల్కొన్నారు.. ప్రజాస్వామిక విప్లవం తీసుకొస్తారు!

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న వేళ యూపీలో ఇప్పటినుంచే రాజకీయ సందడి మొదలైంది. పలు యాత్రల పేరిట జనంలోకి చొచ్చుకెళ్లి వారి ఆదరణ పొందేందుకు.......

Published : 12 Sep 2021 01:11 IST

లఖ్‌నవూ: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న వేళ యూపీలో ఇప్పటినుంచే రాజకీయ సందడి మొదలైంది. పలు యాత్రల పేరిట జనంలోకి చొచ్చుకెళ్లి వారి ఆదరణ పొందేందుకు ఆయా రాజకీయ పార్టీలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఉదయం విజయ్‌ బూత్‌ అభియాన్‌ను ప్రారంభించగా.. ఆ కొద్ది గంటల్లోనే సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ జన్‌మాన్‌-విజయ్‌ పేరిట ప్రచారాన్ని చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఈ కార్యక్రమంతో పాటు ‘హర్‌బూత్‌ పార్‌ యూత్‌’ పేరిట జనంలోకి వెళ్లేందుకు కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. 2022 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ యువశక్తి యూపీలో ప్రతి బూత్‌లోనూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుందన్నారు. పార్టీ సిద్ధాంతం, పని తీరు ఆధారంగా ప్రజల హృదయాలను గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. అలాగే, జన్‌మాన్‌ విజయ్‌ అభియాన్‌ను బూత్‌ స్థాయిల్లో విజయవంతం చేస్తామన్న అఖిలేశ్‌.. యూపీ ప్రజలు మేల్కొన్నారని.. ప్రజాస్వామిక విప్లవం తీసుకొస్తారంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని