Sanjay Raut: శిందే.. నీ ఆత్మగౌరవం ఇదేనా?
ఛత్రపతి శివాజీని తక్కువ చేసి మాట్లాడినందుకుగానూ గవర్నర్ భగత్సింగ్ కొశ్యారీని వెంటనే తొలగించాలని శివసేనలోని ఉద్ధవ్ఠాక్రే వర్గానికి చెందిన సంజయ్రౌత్ డిమాండ్ చేశారు. గవర్నర్ వ్యాఖ్యలపై మౌనం వహించిన ముఖ్యమంత్రి కూడా ఆ పదవికి రాజీనామా చేయాలన్నారు.
ముంబయి: మహారాష్ట్ర గవర్నర్గా భగత్సింగ్ కొశ్యారీని తొలగించాలని శివసేనలోని ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన సంజయ్రౌత్ డిమాండ్ చేశారు. మరాఠా ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఆయన ప్రవర్తించారని మండిపడ్డారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ను ఓ ‘పాత విగ్రహం’గా అభివర్ణించిన ఆయన్ని ముఖ్యమంత్రి శిందే వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. వెంటనే సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాలని అన్నారు. ముంబయిలో రౌత్ మీడియాతో మాట్లాడుతూ..‘‘ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి విడిపోవడానికి ‘‘ ఆత్మగౌరవమే’’ కారణమని చెప్పిన శిందే.. అదే ఉంటే ఇప్పుడు సీఎం పదవికి రాజీనామా చేయాలి’’ అని సంజయ్ రౌత్ అన్నారు.
గవర్నర్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడాన్ని రౌత్ తప్పుబట్టారు. ఏడాదికి నాలుగు సార్లు శివాజీ మహరాజ్ను హేళన చేసినా ప్రభుత్వం మిన్నకుండిపోతోందని విమర్శించారు. ‘‘ భాజపా వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? మరాఠా ప్రజలకు భాజపా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. వెంటనే గవర్నర్ను రీకాల్ చేయాలి’’ అని సంజయ్రౌత్ డిమాండ్ చేశారు.
సావర్కర్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఉద్ధవ్వర్గం నిరసనకు దిగిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ప్రస్తుతం శిందే వర్గం కూడా గవర్నర్ వ్యాఖ్యలపై నిరసన చేపట్టాలని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ