Sasikala: మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి..?
తమిళనాడులో ఏఐఏడీఎంకే బహిష్కృత నేత శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత వచ్చేందుకు సన్నాహాలు
చెన్నై: తమిళనాడులో ఏఐఏడీఎంకే బహిష్కృత నేత శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆమె సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఈమధ్యే జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు శశికళ ప్రకటించారు. ప్రస్తుతం ఏఐఏడీఎంకే ఓటమి చెందిన నేపథ్యంలో.. తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అన్నాడీఎంకే అధినేత మరణం తర్వాత పార్టీ తీవ్ర ఒడిదొడుకులకు గురైన విషయం తెలిసిందే. అదే సమయంలో జైలు నుంచి విడుదలైన పార్టీ బహిష్కృత నేత శశికశ కూడా రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఓటమి పాలయ్యింది. ఇదే అదునుగా భావించిన శశికళ.. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమౌతున్నారనే ప్రచారం మొదలయ్యింది. ఇందుకు సంబంధించి శశికళ మాట్లాడుతన్న ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పార్టీ విషయాలను తప్పకుండా చక్కబెడతాను. ధైర్యంగా ఉండండి. కరోనా ముగిసిన తర్వాత మళ్లీ నేను వస్తాను’ అని శశికళ సదరు ఆడియోలో చెప్పారు. దీనికి జవాబుగా.. ‘మీ వెనకే మేముంటాం అమ్మా’ అని కొందరు పార్టీ కార్యకర్తలు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని టీటీవీ దినకరన్ వ్యక్తిగత సిబ్బంది కూడా ధ్రువీకరించారు.
ఇదిలాఉంటే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీగా శశికళ నియమితులయ్యారు. అయితే, 2017లో అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో ఆమె జైలుకు వెళ్లారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2017 సెప్టెంబర్లో శశికళతో పాటు ఆమె అల్లుడు దినకరన్ను ఏఐఏడీఎంకే పార్టీ నుంచి తొలగించింది. తాజాగా మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అక్రమాస్తుల కేసులో దాదాపు నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించిన శశికళ, ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?