శశికళకు కరోనా పాజిటివ్‌

అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళకు కరోనా వైరస్‌ సోకింది. బెంగళూరులోని సెంట్రల్‌ జైలులో అస్వస్థతకు గురైన శశికళను జైలు అధికారులు బుధవారం బెంగళూరులోని లేడీ క్యూర్‌జోన్‌ ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. జ్వరం, వెన్నునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న

Updated : 22 Jan 2021 14:57 IST

బెంగళూరు: అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళకు కరోనా వైరస్‌ సోకింది. బెంగళూరులోని సెంట్రల్‌ జైలులో అస్వస్థతకు గురైన శశికళను జైలు అధికారులు బుధవారం స్థానిక లేడీ క్యూర్‌జోన్‌ ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. జ్వరం, వెన్నునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఆమెకు గురువారం కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. తొలుత యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గానే తేలినప్పటికీ.. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ జైలు నుంచి ఈ నెల 27న విడుదల కానున్నట్లు ఆమె తరపు న్యాయవాది రాజా సెంధూరపాండియన్‌ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. 

ఇదీచదవండి

శశికళకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని