Adani-Hindenburg: ‘సుప్రీం’ తీర్పు మోదీ సర్కార్కు చెంపపెట్టు: ఆప్
అదానీ(Adani)ని కాపాడేందుకు ప్రధాని మోదీ(PM Modi) ఎంతవరకైనా వెళ్లొచ్చన్నారు ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్. అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేయడంపై ఆయన స్పందించారు.
దిల్లీ: అదానీ (Adani)-హిండెన్బర్గ్ (Hindenburg) వ్యవహారంపై విచారణ జరిపేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆప్ స్పందించింది. ఇటీవల అదానీ గ్రూప్ షేర్ల పతనంతో సహా స్టాక్ మార్కెట్లలో రెగ్యులేటరీ అంశాలను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయడం మోదీ సర్కార్కు చెంపపెట్టుగా పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఈ పరిణామంతో మోదీ ప్రభుత్వ అవినీతి రుజువైందని ఆరోపించారు. అదానీని కాపాడేందుకు ప్రధాని ఎంతవరకైనా వెళ్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో దర్యాప్తు చేయాలని పట్టుబడుతున్నా.. మోదీ సర్కార్ మాత్రం అందుకు అంగీకరించడంలేదని విమర్శించారు. అందువల్లే చివరకు దేశ సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సంజయ్ సింగ్ అన్నారు.
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. కేంద్రం సమర్పించిన నిపుణల కమిటీ ప్రతిపాదనను తిరస్కరించిన సుప్రీం.. ఆ కమిటీని తామే నియమిస్తామని గత విచారణలో వెల్లడించింది. ప్రస్తుత కమిటీకి సప్రే నాయకత్వం వహిస్తుండగా.. విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఓపీ భట్, జేపీ దేవదత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, బ్యాంకింగ్ దిగ్గజం కేవీ కామత్, సోమశేఖరన్ సుందరేశన్ను కమిటీ సభ్యులుగా పేర్కొంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ(SEBI) ప్రస్తుతం కొనసాగుతోన్న విచారణను రెండు నెలల్లో పూర్తి చేసి నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM