నాడు తండ్రి.. నేడు కుమారుడు.. ఒకే శాఖ
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సర్కారు కూలిపోవడం, భాజపా ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియాకు బహుమతి లభించింది. బుధవారం ఆయన కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం
30ఏళ్ల తర్వాత తండ్రి బాధ్యతల్లో సింధియా
దిల్లీ: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సర్కారు కూలిపోవడం, భాజపా ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియాకు బహుమతి లభించింది. బుధవారం ఆయన కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాఖల కేటాయింపులో భాగంగా ఆయనకు పౌర విమానయాన శాఖ అప్పగించారు. అయితే, 30ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావ్ సింధియా కూడా పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడే అదే శాఖ బాధ్యతలు జ్యోతిరాదిత్య చేపట్టడం ఆసక్తికరం.
1991-93 మధ్య పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మాధవరావ్ సింధియా.. పౌర విమానయానం, పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో పౌర విమానయాన మంత్రిగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఓ విమానం కూలిన ఘటనకు బాధ్యతవహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా.. ఇప్పుడు జ్యోతిరాదిత్య ముందు కూడా పెద్ద సవాలే ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి దెబ్బకు విమానయాన రంగం దెబ్బతింది. కరోనా ముందుతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖను జూనియర్ సింధియా సురక్షితంగా ల్యాండ్ చేస్తారో లేదో చూడాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు.
తండ్రి బాటలోనే..
మాధవరావ్ సింధియా 2001లో జరిగిన ఓ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న ఓ విమానం ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి శివార్లలో కుప్పకూలింది. తండ్రి హఠాన్మరణంతో జ్యోతిరాదిత్య సింధియా రాజకీయాల్లో అడుగుపెట్టారు. మాధవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ లోక్సభ నియోజకవర్గానికి 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.
రాజకీయ కెరీర్ పరంగా ఈ తండ్రీకొడుకుల మధ్య చాలా పోలికలే ఉన్నాయి. పౌరవిమానయాన శాఖ బాధ్యతలు చేపట్టకముందు ఇద్దరూ కేంద్రమంత్రులుగా పనిచేశారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో మాధవరావ్ రైల్వే మంత్రిగా వ్యవహరించగా.. మన్మోహన్సింగ్ నేతృత్వంలోని యూపీఏ సర్కారులో జ్యోతిరాదిత్య ఐటీ, సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు.
పార్టీ మారి.. కేంద్రమంత్రిగా
అయితే ఒక విషయంలో మాత్రం వీరిద్దరూ పరస్పరం భిన్నంగా ఉన్నారు. మాధవరావు తొలుత జనసంఘ్లో పనిచేశారు. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్లో చేరారు. కానీ, జ్యోతిరాదిత్య మాత్రం కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరారు. ఇద్దరికీ పార్టీ మారిన తర్వాతే కేంద్రమంత్రి పదవి దక్కడం గమనార్హం. 2002లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జ్యోతిరాదిత్య దాదాపు రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్తో కలిసి పనిచేశారు. రాహుల్గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు.
అయితే గతేడాది గాంధీ కుటుంబానికి, సింధియాకు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో 2020 మార్చి 10న మాధవరావు జయంతి సందర్భంగా తన రాజకీయ జీవితంలో కొత్త ప్రయాణాన్ని ఆరంభించారు జూనియర్ సింధియా. ఆ రోజే కాంగ్రెస్కు గుడ్బై చెప్పి భాజపాలో చేరారు. సింధియాతో పాటు మధ్యప్రదేశ్లో చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీంతో 15 నెలలకే కమల్నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత శివరాజ్సింగ్ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో కేంద్ర మంత్రివర్గంలో సింధియాకు పీట వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. యర్రగుంట్లలో ఉద్రిక్తత
మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. -
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్కల్యాణ్తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్రెడ్డి ఎద్దేవా చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోరం..
అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే
రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది. -
క్యాష్ కొట్టు.. బస్సులు పట్టు
ఇటీవల వైకాపా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు 8,700 ఆర్టీసీ బస్సులు తీసుకున్నారు. వీటికి ఆ పార్టీ దాదాపు రూ.20 కోట్ల వరకు చెల్లించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత