Ashok Gehlot: గహ్లోత్ లీడర్ వసుంధర రాజెనా.. సోనియాగాంధీ కాదా..?: పైలట్ ధ్వజం
వసుంధర రాజెను ప్రశంసిస్తూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) మండిపడ్డారు. ఎన్నికల వేళ ఆయన మాటలు పార్టీకి చేటుగా మారుతున్నాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
జైపుర్: మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. రాజస్థాన్ కాంగ్రెస్ (Rajasthan Congress)లో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ (Ashok Gehlot).. భాజపా (BJP) నాయకురాలు వసుంధర రాజెపై ప్రశంసలు కురిపించడం పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot).. గహ్లోత్పై బహిరంగంగానే విమర్శల దాడికి దిగారు. చూస్తుంటే.. సీఎం బాస్ సోనియా గాంధీ కాదని, భాజపా వసుంధర రాజెనే ఆయన తన నాయకురాలిగా భావిస్తున్నారని దుయ్యబట్టారు.
ధోల్పుర్లో గత ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) మాట్లాడుతూ.. 2020లో తన ప్రభుత్వం కూలిపోకుండా వసుంధర రాజె (Vasundhara Raje) ఆదుకున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు దారితీశాయి. వీటిపై సచిన్ పైలట్ (Sachin Pilot) మంగళవారం స్పందిస్తూ.. ‘‘సీఎం ప్రసంగం వింటుంటే.. ఆయన నాయకురాలు సోనియా గాంధీ కాదేమో.. వసుంధర రాజెనేమో అని అన్పిస్తోంది. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని సీఎం ఆరోపించారు. అదే సమయంలో భాజపా నాయకురాలే తన సర్కారు పడిపోకుండా ఆదుకున్నారని చెబుతున్నారు. దీనిపై ఆయన వివరణ ఇవ్వాలి. సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలనే గహ్లోత్ అవమానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి చేటు చేస్తాయి’’ అని మండిపడ్డారు.
వసుంధర రాజె హయాంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేపట్టాలని తాను ఎన్నిసార్లు అభ్యర్థించినా గహ్లోత్ (Ashok Gehlot) ఎందుకు చర్యలు తీసుకోలేదో తనకు ఇప్పుడు అర్థమైందని పైలట్ దుయ్యబట్టారు. భాజపా నేతలతో ఉన్న రహస్య బంధం కారణంగా ఆ అవినీతిపై దర్యాప్తునకు సీఎం అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ‘‘గత రెండేళ్లుగా గహ్లోత్ వర్గం నుంచి నేను ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా. పార్టీలో నాయకత్వ మార్పు కోరుకున్నందుకు నన్ను ద్రోహిగా చిత్రీకరించారు. అయినా నేను ఏమీ చెప్పలేదు. పార్టీకి నష్టం కలిగించడం నాకిష్టం లేదు’’ అని పైలట్ వివరించారు.
2020 జులైలో అప్పటి ఉపముఖ్యమంత్రి పైలట్, మరో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గహ్లోత్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. సుమారు నెలపాటు సాగిన ఆ సంక్షోభానికి అధిష్ఠానం జోక్యంతో తెరపడింది. ఆ ఘటనతో పైలట్ (Sachin Pilot)ను ఉపముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి తొలగించారు. ఆ పరిణామాలపై సీఎం ఇటీవల స్పందిస్తూ.. ఆ సమయంలో వసుంధర రాజె సహా కొందరు భాజపా నేతలు తనకు అనుకూలంగా వ్యవహరించారని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను రాజె ఖండించారు. ఆయన మాటలు కుట్రపూరితంగా ఉన్నాయని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. రాజె హయాంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇటీవల పైలట్ తన సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కృష్ణుడి గోపికను నేనే హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు. -
నేడు నామినేషన్ వేయనున్న పురందేశ్వరి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది.