‘మీ జాతకాలు మా దగ్గర ఉన్నాయ్.. జాగ్రత్త!’.. కేంద్రమంత్రికి రౌత్ వార్నింగ్!!
మహారాష్ట్రలో శివసేన, భాజపా మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. భాజపా నేత, కేంద్రమంత్రి నారాయణ్ రాణే చేసిన ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలపై తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ముంబయి: మహారాష్ట్రలో శివసేన, భాజపా మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. భాజపా నేత, కేంద్రమంత్రి నారాయణ్ రాణే చేసిన ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలపై తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మీ జాతకాలు కూడా మా దగ్గర ఉన్నాయన్న విషయం మరిచిపోవద్దు జాగ్రత్త!’ అంటూ హెచ్చరించారు.
ఉద్ధవ్ ఠాక్రే వ్యక్తిగత నివాసం అయిన మాతోశ్రీ భవనంలోని నలుగురు వ్యక్తుల (ఠాక్రే కుటుంబం)కు త్వరలో ఈడీ నోటీసులు పంపించబోతోదంటూ ఇటీవల రాణే వ్యాఖ్యానించారు. దీనిపై రౌత్ తాజాగా స్పందించారు. ‘మీరు కేంద్రమంత్రి అయ్యి ఉండొచ్చు. కానీ, ఇది మహారాష్ట్ర అన్న సంగతి మరిచిపోకండి. మేం మీకు బాప్. దీని అర్థమేంటో తెలిసే ఉంటుందని అనుకుంటున్నా. మా జాతకం మీ దగ్గర ఉందని మీరు అనుకుంటున్నారు. మీ జాతకాలు కూడా మా దగ్గర ఉన్నాయన్న సంగతి మరిచిపోవద్దు. జాగ్రత్త!’’ అని రౌత్ హెచ్చరించారు.
భాజపా ఎంపీ కిరీట్ సోమయ్యపైనా రౌత్ విమర్శలు గుప్పించారు. శివసేన నాయకుల అవినీతి గురించి పత్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు త్వరలో ఇవ్వబోతున్నానంటూ కిరీట్ సోమయ్య ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై రౌత్ స్పందిస్తూ ‘‘మీరు ఆ పత్రాలను కేంద్రానికి ఇవ్వండి. మేం మీవి ఇస్తాం. మీ బెదిరింపులకు మేం భయపడం’’ రౌత్ వ్యాఖ్యానించారు. ఇతరుల సంగతి పక్కన పెట్టి.. ముందు ఈ ఆరోపణలకు సమాధానం ఇవ్వండి అంటూ పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ రౌత్ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య