శవపరీక్షకు సంతకం పెట్టాలని పోలీసులు కొట్టారు: డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు
వైకాపా ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మృతుడు సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం విషయంలో కాకినాడ జీజీహెచ్ వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.
కాకినాడ: వైకాపా ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మృతుడు సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం విషయంలో కాకినాడ జీజీహెచ్ వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్సీని అరెస్టు చేయడంతో పాటు బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి. హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ సహా ఎస్సీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.
సుబ్రహ్మణ్యం మృతదేహానికి ఇంకా పోస్టుమార్టం పూర్తి కాలేదు. మృతుడి కుటుంబసభ్యులు అంగీకరించి సంతకం చేస్తేనే పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుంది. ఉదయం నుంచి కనిపించకుండా ఉన్న సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులను పోలీసులు కాకినాడ జీజీహెచ్కు తీసుకొచ్చారు. శవపంచనామా కోసం కుటుంబసభ్యులను తీసుకెళ్లారు. అయితే శవపరీక్ష కోసం సంతకం పెట్టాలని బలవంతం చేస్తున్నారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వారిని కొట్టారని చెబుతున్నారు. సుబ్రహ్మణ్యం భార్యను సైతం పోలీసులు బలవంతంగా లోపలికి తీసుకెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. జీజీహెచ్ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆందోళన చేస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ సహా ఎస్సీ సంఘాల నాయకులను పోలీసులు లోపలికి అనుమతించారు. కాకినాడ జీజీహెచ్ వద్ద భారీ సంఖ్యలో బలగాలు మోహరించాయి. అయితే పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారా? లేదా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ