Shabbir Ali: ఫాంహౌస్‌లో రోహిత్‌రెడ్డి మంచి డ్రామా ప్లే చేశారు: షబ్బీర్‌ అలీ

‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ స్పందించారు. ఫాంహౌస్‌లో తెరాస ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మంచి డ్రామా ప్లే చేశారని ఆయన వ్యాఖ్యానించారు.

Published : 28 Oct 2022 14:39 IST

హైదరాబాద్‌: ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ స్పందించారు. ఫాంహౌస్‌లో తెరాస ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి మంచి డ్రామా ప్లే చేశారని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో షబ్బీర్‌ అలీ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’కు కవరేజీ లేకుండా చేసేందుకు తెరాస, భాజపా ఈవిధంగా కుట్ర చేశాయని ఆరోపించారు. 

ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌ 33 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని షబ్బీర్‌ ఆరోపించారు. భాజపా కూడా దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందన్నారు. ఆ రెండూ దొంగ పార్టీలేనని  సీఎం కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే ఈ డ్రామా అంతా జరిగిందన్నారు. నేరం జరిగినపుడు విచారణకు పిలిచి ప్రశ్నించాలని.. ఎమ్మెల్యేలను విచారించకుండా ప్రగతిభవన్‌కు ఎలా తీసుకెళ్తారని షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని