Sharad Pawar: మోదీ నోట ఆ వ్యాఖ్యలా?.. ఆశ్చర్యపోయానన్న పవార్
Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల ప్రచారంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. అందులో ప్రధాని మోదీ చేసిన కొన్ని వ్యాఖ్యలను ఆయన ఆక్షేపించారు.
ముంబయి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ(PM Modi) మతపరమైన నినాదాలు ఇవ్వడం తనను ఆశ్చర్యపర్చిందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్(NCP president Sharad Pawar) అన్నారు. మతం, మతపరమైన అంశాలను ఎన్నికల ప్రచారంలో జొప్పించడం సరికాదని మీడియాతో మాట్లాడారు.
‘ఎన్నికల్లో ప్రజాస్వామ్య, లౌకికవాద విలువలు కాపాడతామని ప్రమాణ స్వీకారం చేస్తాం. కానీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మతపరమైన నినాదాలు చేయడం నన్ను ఆశ్చర్యపర్చింది. లౌకికవాదాన్ని మనమంతా అంగీకరించాం. ఎప్పుడైతే ఎన్నికల ప్రచారంలో మతం గురించి, మతపరమైన అంశాల గురించి మాట్లాడతామో.. అప్పుడు కొత్తరకం పరిస్థితులు ఏర్పడతాయి. అవి ఏ మాత్రం మంచిది కాదు’అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇటీవల మోదీ మాట్లాడుతూ.. ‘ది కేరళ స్టోరీ’సినిమా గురించి ప్రస్తావించారు. ఒక రాష్ట్రంలో జరుగుతోన్న ఉగ్రవాదుల మోసపూరిత విధానాలు, కుట్రల ఆధారంగా దీన్ని తెరకెక్కించారని అన్నారు. ఆ చిత్రం ఒక రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఉగ్ర కుట్రలను బయటపెడుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే బజరంగ్దళ్ వంటి సంస్థలపై నిషేధం విధిస్తామంటూ ఇటీవల ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొన్నట్టు వచ్చిన వార్తలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనిని భాజపా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. వీటిని ఉద్దేశించే పవార్ స్పందించారు.
సుప్రియ సుముఖంగా లేరు: పవార్
ఎన్సీపీ అధ్యక్ష పదవిని స్వీకరించేందుకు తన కుమార్తె సుప్రియా సూలే సిద్ధంగా లేరని పవార్(Sharad Pawar) వెల్లడించారు. ప్రస్తుతం ఆమె దృష్టంతా వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలపైనే ఉందన్నారు. కొద్దిరోజుల క్రితం పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయానికి ఆమోదం లభించకపోవడంతో ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. అప్పుడు సుప్రియ పార్టీ బాధ్యతలు తీసుకుంటారంటూ వార్తలు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్