Andhra News: వైకాపా ప్రభుత్వం కొత్త బిల్లు తెస్తామని చెప్పటం ఉత్తమాటలే: షరీఫ్
అమరావతి విషయంలో వైకాపా ప్రభుత్వం మళ్లీ తల గోక్కుంటదని అనుకోవట్లేదని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ అన్నారు. ప్రభుత్వం మళ్లీ కొత్త బిల్లు తెస్తామని చెప్పటం ఉత్తమాటలేనని కొట్టిపారేశారు...
గుంటూరు: అమరావతి విషయంలో వైకాపా ప్రభుత్వం మళ్లీ తల గోక్కుంటదని అనుకోవట్లేదని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ అన్నారు. ప్రభుత్వం మళ్లీ కొత్త బిల్లు తెస్తామని చెప్పటం ఉత్తమాటలేనని కొట్టిపారేశారు. గురువారం రాత్రి గుంటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షరీఫ్ను జిల్లా తెదేపా నేతలు ఘనంగా సన్మానించారు. రాజధాని రైతులు, ఐకాస నేతలు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ... ‘‘అమరావతి కోసం పోరాడుతున్న రైతులే సన్మానానికి అర్హులు. త్రికరణ శుద్ధిగా పనిచేయాలన్న చంద్రబాబు పాఠాలు పాటించాను. 3 రాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీకి పంపినప్పుడు అందరూ అభినందించారు. తెదేపా ఎమ్మెల్సీలు ఎవరూ ప్రలోభాలకు లొంగలేదు. ఎమ్మెల్సీలు అండగా ఉండటంతో ధైర్యంగా ముందుకెళ్లా’’ అంటూ 3 రాజధానుల బిల్లు మండలిలో ప్రవేశ పెట్టిన సందర్భంలో జరిగిన ఘటనలు షరీఫ్ గుర్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్నేత దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. అధికారం ఉందని వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా చేశారని విమర్శించారు. 3 రాజధానుల బిల్లు సందర్భంగా మండలి ఛైర్మన్గా ఉన్న షరీఫ్ను అవమానించారని పేర్కొన్నారు. షరీఫ్ ధైర్యం వల్లే రాజధానిగా అమరావతి సజీవంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... రాజ్యాంగం ప్రకారమే పాలన సాగాలని షరీఫ్ చాటిచెప్పారన్నారు. ప్రజా రాజధానిని కాదనే హక్కు ఈ సీఎంకు లేదన్నారు. అమరావతిని రాజ్యాంగబద్ధంగా షరీఫ్ కాపాడారని వివరించారు. గాంధారి పుత్రులు రాష్ట్రాన్ని ఏలుతున్నారని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని